న్యూఇయర్ కి స్వాగతం పలుకుతూ.. పాత సంవత్సరాన్ని సాగనంపే క్రమంలో యువత చేసుకునే సంబరాలు అకాశాన్ని అంటుతాయి. దీనికి మద్యం కూడా తోడేతై ఇక వారి సంబరాలకు కొలమానమే వుండదు. ఓ వైపు పోలీసులు అర్థరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే సంబరాలను చేసుకోవాలని హెచ్చరిస్తున్న క్రమంలో మరోవైపు ఎక్సైజ్ శాఖ మాత్రం యువతను మద్యం దుకాణాల వైపు పురిగోల్పుతుంది. ఇక తమకు అవకాశం వున్న ప్రతీచోటా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటుంది.
అదెలాఅంటే.. న్యూఇయర్ సంబరాల్లో యువత అధికంగా తమ స్నేహితులతో కలసి జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మద్యం అలావాటు లేని యువత కూడా మధ్యం అలవాటు చేసుకుంటారు. కొత్త ఏడాది జోష్ లో తాగేసి, తినేసి, సంబరాలు చేసుకునే యువతతో పాటు మద్యం ప్రియులకు ఎక్సైజ్ శాఖ బంపరాఫర్ ప్రకటించింది. డిసెంబరు 31 రాత్రి అదనంగా మరో గంటపాటు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేసింది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు జరుపుతుండగా, బార్లు మాత్రం రాత్రి 12 గంటల వరకు తెరచి వుంటాయి. ఇక అదే జిల్లాల్లో రాత్రి పది గంటల వరకు మద్యం దుకాణాలు తెరచివుండగా, బార్లు మాత్రం రాత్రి 11 గంటల వరకు అమ్మకాలు సాగిస్తాయి. ఎక్సైజ్ శాఖ తాజా అదేశాలతో డిసెంబర్ 31న మాత్రం వైన్ షాప్లు మరో గంట అదనంగా తెరిచే ఉంటాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో అర్ధరాత్రి 12 గంటల వరకు, జిల్లాల్లో రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలకు అమ్మకాలు సాగించవచ్చు.
ఇక, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్ల్లో మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు తెరిచి ఉంచుతారు. కొత్త ఏడాది సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించేవారు మాత్రం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఇటీవలే తెలిపిన విషయం తెలిసిందే. ఇందుకు అదనంగా కొంత మొత్తం చెల్లించాలని, జీహెచ్ఎంసీ పరిధిలో రూ.9వేలు, జిల్లాల్లో రూ.6వేల ఫీజు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more