శబరిగిరిపై కొలువైన అయ్యప్ప స్వామి ఆలయ పవిత్ర, విశిష్టతను కాపాడాలంటూ కేరళలోని మహిళలు కదం తొక్కారు. అయితే గతంలో చేసిన అందోళనలకు భిన్నంగా తమ మణికంఠుడి ఆలయ పవిత్రత పరిరక్షించాలంటూ ఏకంగా 795 కిలోమీటర్ల పోడవునా అత్యంత భారీ ప్రదర్శన చేశారు. చేతులలో అయ్యప్ప జ్యోతులను వెలిగించి పట్టుకుని స్వామియే శరణం అయ్యప్ప అంటూ.. నినాదాలు చేశారు.
శబరిమల పవిత్ర విషయంలో ఎంతో ఓర్పు, సహనంతో చైతన్యం చూపించిన కేరళా మహిళా సుమారు రెండు గంటల పాటు ప్రదర్శన నిర్వహించి.. కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి చెమటలు పట్టేలా చేశారు. దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం చేయవచ్చని ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాలని మహిళలు విజ్ఞప్తి చేశారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని వేడుకున్నారు.
కేరళలోని పట్టణాలు, గ్రామాలు, రహదారులను కలిపేలా మొత్తం 795 కిలోమీటర్ల మేర మహిళలు భారీ ప్రదర్శన చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో దీపాలతో రోడ్డుకు రెండు పక్కలా నిలబడి తమ అభిప్రాయాలను ముక్తకంఠంతో చెప్పారు. కేరళకు ఉత్తరాన ఉన్న కసర్గాడ్ జిల్లా హోసంగడి నుంచి దక్షిణాన ఉన్న రాజధాని తిరువనంతపురం మీదుగా కన్యాకుమారిలోని త్రివేణి వరకు దీపాల ప్రదర్శన చేశారు. శబరిమల పవిత్రత, సంప్రదాయం కాపాడాలి అంటూ నినదించారు.
మహిళలు, యువతులు, చిన్న పిల్లలు ఇలా అన్ని వర్గాల వాళ్లు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. పురుషులు కూడా మహిళలకు మద్దతు తెలుపుతూ జ్యోతులు వెలిగించి తమ ఆకాంక్ష చాటారు. డీజీపీ టీపీ సేన్ కుమార్, నటుడు-బీజేపీ ఎంపీ సురేష్ గోపి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. శబరిమల కర్మ సమితి పిలుపుతో మహిళలంతా ఇలా తమ ఐక్యతను చూపించారు. శబరిమలలో మహిళ ప్రవేశాన్ని నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more