అమెరికాలో ముగ్గురు తెలుగు విద్యార్థులు సజీవ దహనం అయ్యారు. అగ్రరాజ్యంలోని టెన్నెసా రాష్ట్రం కొలిర్ విలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం నలుగురు సజీవదహనం కాగా, వారిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారని అక్కడి పోలీసులు తెలిపారు. కొలిర్ విలీలోని ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు సజీవంగా అహుతయ్యారు.
అయితే ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం నల్గొండ జిల్లాలో విషాదం అలుముకుంది. నల్గొండ జిల్లా నేరడుగమ్ము మండలం గుర్రపుతండా గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాత నాయక్ దంపతుల సంతానమైన సాత్విక నాయక్ (16), జ్వాయి నాయక్ (13), కుమారుడు సుహాస్ నాయక్ (14) లని పోలీసులు పేర్కోన్నారు. వీరంతా ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లి.. అగ్నిప్రమాదం బారిన పడి మరణిచారు.
అటు అమెరికాలోని వీరి స్నేహితులతో పాటు ఇటు నల్గోండ జిల్లాలోనూ విషాదఛాయలు అలముకున్నాయి. ఇక, క్రిస్మస్ సందర్భంగా ఇంటికి దీపాలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. దీపాలంకరణ వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. మృతుల్లో మరో వ్యక్తిని ఇంటి యజమానిగా గుర్తించారు. చిన్నతనంలో ఉన్నతవిద్య కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన వీరు.. దేశం కాని దేశంలో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్థులు కన్నీళ్ల పర్యంతమయ్యారు.
అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో నలుగురు తప్పించుకునే వీలు లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలో కరీ అనే మహిళతో పాటు సాత్విక నాయక్, సుహాస్ నాయక్, జ్వాయ్ నాయిక్ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కరీ భర్త డానియెల్, కుమారుడు కోల్ ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. స్మోక్ అలారం లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more