టాలీవుడ్ హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ వ్యవహారంలో రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఇవాళ తెలంగాణ రెవెన్యూ అధికారులు హైకోర్టులో తమ కౌంటరు దాఖలు చేశారు. హీరో ప్రభాస్ ప్రభుత్వ భూమిని అక్రమించుకున్నారని వారు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కోన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు చెందిన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేశామని కూడా వారు నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం.
శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గం సమీపంలో, సర్వే నంబర్ 5/3లో ప్రభాస్ కు చెందిన 2,083 చదరపు అడుగుల స్థలాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని చెబుతూ, అందుకు గల కారణాలను తమ పిటిషన్ లో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వంపై బాహుబలి సమరశంఖం పూరించిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తన గెస్ట్ హౌజ్ ను తెలంగాణ రెవెన్యూ అధికారులు సీజ్ చేయడంపై ఏకంగా హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్.. న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
తన స్థలం అంతా సక్రమంగానే వున్నా.. ఎలాంటి అక్షేపణలు భవిష్యత్తులో తలెత్తకుండా తాను ముందస్తుగా తెలంగాణ ప్రభుత్వానికి కూడా భూమి క్రమబద్దీకరణకు సంబంధించి ఎల్ఆర్ఎస్ కు కూడా దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఇందుకోసం రూ. కోటి ఐదు లక్షలు కూడా వెచ్చించానని, దానిపై ఇంకా తెలంగాణ రెవెన్యూ అధికారుల నిర్ణయం వెలువడకముందే.. అధికారులు తన గెస్ట్ హౌజ్ ను సీజ్ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాగా ఈ కేసును న్యాయస్థానం ఈ నెల 31కి వాయిదా వేసింది. మరి 31న ప్రభాస్ హైకోర్టు న్యూ ఇయర్ గిఫ్ట్ ను ఇస్తుందా.? లేక తెలంగాణ సర్కార్ కు అది దక్కుతుందా వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more