పెను తుపానుగా మారిన ‘పెథాయ్’ ఇవాళ మధ్యాహ్నం తీరం దాటనుంది. ప్రస్తుతం కాకినాడకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన పెథాయ్, గంటకు 19 కి.మీ వేగంతో తూర్పుగోదావరి జిల్లావైపు వేగంగా కదులుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని తుని-యానాంల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే తిత్లీ తుఫాను మిగిల్చిన విషాదం నుంచి ఇంకా కోలుకోని ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రకృతి పగబట్టినట్లుంది. పెథాయ్ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
వరి, జొన్న తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలని సూచించారు. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ పట్టలు కప్పి భధ్రపరచాలని.. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు వీటిని పొందవచ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉంటున్నవారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పెథాయ్ తుపాను పలు రైళ్లు, బస్సులు రద్దు
పెథాయ్ తుపాను ప్రభావం గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలపై అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాలలో నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. ఇక ఇదే సమయంలో అర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అమలాపురం, కాకినాడ, తెనాలి సహా పలు ప్రాంతాల్లో అర్టీసీ సేవలను రద్దు చేశారు. ఇక పలు గుంటూరు, తెనాలి, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ పోర్టు, రాజమండ్రిల మధ్య నడిచే అన్ని మెము ప్యాసింజర్ రైళ్లను అధికారులు రద్దు చేశారు. వీటితో పాటు భీమవరం, రాజమండ్రి, నిడదవోలు, విజయవాడ, నర్సాపూర్, గుంటూర్ల మచిలీపట్నం మధ్య నడిచే డెము ప్యాసింజర రైళ్లు రద్దయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more