కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో 12 మందిని బలితీసుకున్న ప్రసాదంలో క్రిమిసంహారక మందు కలసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పురుగుల మందు కలసిన ప్రసాదాన్ని సేవించిన భక్తులు 12 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించిన మాజీ గ్రామసర్పంచ్ తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు మరియమ్మ ఆలయంపై గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య అధిపత్య పోరు ముదిరి.. 12 మంది ప్రాణాలను బలిగొనింది.
సులివాడి గ్రామంలోని కిచ్చుగుత్తి మారెమ్మ ఆలయం పగ్గాలను చేపట్టిన ఓ వర్గం.. ఆలయానికి గోపుర శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వందలాదిగా భక్తులు తరలివచ్చారు. గోపుర పూజ అనంతరం భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. అయితే, అప్పటికే ప్రసాదంలో విషయం కలవడంతో అది తిన్న తర్వాత భక్తులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని వైద్యం కోసం స్థానిక హాస్పిటల్కు తరలించగా 12 మంది మృతి చెందారు. భక్తులకు మరింత మెరుగైన వైద్యం కోసం మైసూరు ఆస్పత్రికి తరలించారు. విచారణ చేపట్టిన అధికారులు ప్రసాదంలో విషం కలిపినట్టు గుర్తించారు.
ఆలయంపై మరో కుటుంబం ఆధిపత్యం చేలాయించడం ఇష్టంలేని వారి బంధువు, గ్రామ మాజీ సర్పంచ్ ఇందులో ప్రధాన నిందితుడు. ఆలయ గోపుర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోన్న గ్రామంలోని మరో వర్గమే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాధమికంగా నిర్ధరించారు. ఆలయ నిర్మాణాన్ని ఈ వర్గం వ్యతిరేకించగా, మరో వర్గం మాత్రం పట్టుబట్టి మరీ వేడుకను నిర్వహించింది. దీంతో మరింత ఆగ్రహించిన ప్రత్యర్థులు ప్రసాదంలో క్రిమి సంహారక మందును కలిపి 12 మంది ప్రాణాలను బలి తీసుకున్నారు.
మారెమ్మ ఆలయ నిర్మాణ బాధ్యతలను చిన్నప్పి అనే వ్యక్తి తీసుకోవడంతో ఇది ఇష్టంలేని ఆయనకు వరుసకు సోదరుడయ్యే దేవనట్టి మరో వ్యక్తితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు గ్రామస్థులు తెలిపారు. పోలీసుల కూడా వీరిపైనే అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దేవనట్టి, మహాదేశ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తోన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. ఘటన గురించి తెలియగానే కర్ణాటక సీఎం కుమారస్వామి హుటాహూటీన అక్కడకు చేరుకున్నారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం మైసూర్ తరలించాలని ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more