తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు ఎన్నికల సంఘం అధికారుల. మరికొన్ని గంటల వ్యవధిలో తెలంగాణలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సగటు ఓటర్లకు, బరిలో నిలిచిన అభ్యర్థులలో తలెత్తే పలు అంశాలపై క్లారిటీని ఇచ్చింది ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రంలోకి ఎవరెవరికి ప్రవేశం ఉంటుంది? ఎంతమంది ఒకేసారి వెళ్లవచ్చు? వంటి అంశాల విషయంలో ఎన్నికల సంఘం నియమావళిని విడుదల చేసింది.
పోలింగ్ కేంద్రంలోకి అనుమతించిన వ్యక్తులకు మాత్రమే లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ జాబితాలో ఎన్నికల సంఘం ద్వారా అనుమతించిన వారు కొందరు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతించేవారు ఇంకొందరు ఉంటారు. ఒకేసారి ఎంత మంది ఓటర్లను అనుమతించాలన్న అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్ చేతుల్లో ఉంటుంది. పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది, ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు లోనికి వెళ్లవచ్చు.
ఆ నియోజకవర్గంలో పోటీ పడే అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు వెళ్లవచ్చు. ఓటు వేయడానికి వచ్చే వారు, చంకలో ఉండే చంటిబిడ్డలు, అంధులు, వృద్ధులకు తోడుగా వచ్చినవారు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నియమించబడిన వ్యక్తులు లోనికి వెళ్లొచ్చు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరించారు.
అయితే పోలింగ్ రోజున ఓటు వేసే ఓటర్లు, సిబ్బంది పోలిగ్ స్టేషన్లో మాత్రం మొబైల్ ఫోన్ ను వినియోగించరాదన్న అదేశాలు వచ్చాయి. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్ తీసుకురావద్దని ఆదేశించింది. పోలింగ్ సిబ్బంది కూడా ఫోన్ తీసుకువెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఫోన్ అత్యవసరమైతే ప్రిసైడింగ్ అధికారి అనుమతితో ఫోన్ తీసుకువెళ్లాలని తెలిపారు. పోలీసులు కూడా ప్రిసైడింగ్ అధికారి అనుమతి ఇస్తేనే పోలింగ్ కేంద్రంలోని వెళ్లాలని ఈసీ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more