ఉత్తర్ ప్రధేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో మహాఘట్ బంధన్ ఏర్పడకుండా అధికార బీజేపి తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తుంది. అందుకనే మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీ మహాకూటమి నుంచి తప్పకుంటానని సంకేతాలు కూడా ఇస్తున్నారంటే ఇది ఆ ప్రయత్నాల ఫలమేనా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే అత్యధికంగా 80 పార్లమెంటు స్థానాలు వున్న ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం 73 అధికార బీజేపి పార్టీకి కైవసం చేసుకుంది. అయితే తాజాగా రాజకీయ కూటములు ఏర్పడనున్నాయన్న సంకేతాలతో మహాకూటమి ఏర్పడింతే బీజేపి బలం సగానికి పైగానే తగ్గిపోతుందని తాజా ప్రీపోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
దీంతో ఇక్కడ తమ బలం, పట్టు కోల్పోకూడదని.. ఢిల్లీలో మళ్లి చక్రం తిప్పాలంటే ఇక్కడ మెజారిటీ సీట్లు తమే సాధించాలని బీజేపి ప్రయత్నాలు చేస్తుంది. ఆదే ఫలితం రానున్న 2019 ఎన్నికలలో కూడా పునరావృతం కావడానికి కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు. అయితే, ఉత్తర్ప్రదేశ్ లో విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీ ఆశలు గండిపడక తప్పదని 'టైమ్స్ నౌ - సీఎన్ఎక్స్ ' తాజా సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి, ప్రతిపక్షాలు విడివిడిగా పోటీచేస్తే బీజేపీ 49 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వేలో వెల్లడయ్యింది. అంటే, 2014తో పోలిస్తే ఇవి 24 సీట్లు తక్కువన్నమాట. ఇదే సమయంలో ఎస్పీ, బీఎస్పీలకు చెరో తొమ్మిది, కాంగ్రెస్ కు 5, ఇతరులకు 2 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది.
కానీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీలు కూటమిగా ఏర్పడితే ఎన్డీఏకు తలనొప్పి తప్పదని అంచనా వేసింది. మహాఘట బంధన్గా ఏర్పడితే కూటమి 49 సీట్లను దక్కించుకుంటుందని, బీజేపీ 31 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. అలా కాకుండా ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే కలిసి పోటీ చేస్తే 33 స్థానాల్లోనూ, బీజేపీ 45 స్థానాల్లో, కాంగ్రెస్ రెండు చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ప్రధాని అభ్యర్థిగా మాత్రం మోదీకి 42 శాతం మంది మద్దతు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని 20 శాతం మంది కోరుకోగా, 11 శాతంతో బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అలాగే 16 శాతం మంది కొత్త వ్యక్తి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో అచ్చే దిన్ నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీ, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే భావన వ్యక్తమవుతోంది. మోదీ రాకతో మంచి రోజుల వచ్చాయని 52 శాతం మంది అభిప్రాయపడగా, 30 శాతం మంది ఎలాంటి మార్పులేదని, 17 శాతం మంది ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. అంతేకాదు, ఆర్థిక అంశాలకే ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందని 74 శాతం మంది అభిప్రాయపడగా, రామమందిరం అంశం ప్రభావం చూపుతుందని 11 శాతం మంది, రాఫెల్ ఒప్పందం కూడా కీలక కానుందని 10 శాతం మంది భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more