మైనర్ బాలికలే ఆ మానవమృగం టార్గెట్. ఎక్కడైనా ఒంటరిగా మైనర్ బాలికలు కనబడితే వారిని అపహరించి, వారిని దారుణంగా హింసించి, తన పశువాంఛ తీర్చుకుంటాడు. తన అకృత్యం ఎవరూ పసిగట్టకూడదన్న కారణంతో వారిని అత్యంత దారుణంగా హతమార్చేస్తాడు. మనిషి రూపంలో వున్న ఈ పైశాచిక మృగాన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో రెండేళ్లుగా అభం శుభమెరుగని చిన్నారులపై అకృత్యాలకు పాల్పడుతున్న గురుగ్రామ్ ఉన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నవంబరు 12న గురుగ్రామ్లోని ఓ మురికివాడలో అత్యంత దారుణ స్థితిలో ఉన్న మూడేళ్ల బాలిక మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ బాలిక కాళ్లు విరగ్గొట్టి, తలను ఛిద్రం చేసి, అత్యాచారం చేసిన తర్వాత, మర్మంగాల్లోకి కట్టెను చొప్పించి అత్యంత హేయంగా హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఈ కేసును సవాల్ గా తీసుకున్న అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితుడు యూపీలోని మహోబా జిల్లా గంజ్ గ్రామానికి చెందిన సునీల్ (20)గా గుర్తించి, అతడి అరెస్ట్ చేశారు.
విచారణలో నిందితుడు విస్తుపోయిన విషయాలను వెల్లడించాడు. పనీపాటా లేకుండా గాలికి తిరిగే సునీల్ ఎక్కడైనా తిండి దొరుకుతుందా అని ఆబగా ఎదురుచూసేవాడు. ఆశ్రమాలు, ఆలయాల్లో ఆహారం, ప్రసాదాలు పెడితే తినడం, బస్టాపులు, ఫుట్ పాత్ లపై నిద్రపోవడం ఇది అతడి దినచర్య. ఈ క్రమంలో ఎవరైనా బాలికలు కనిపిస్తే వారికి స్వీట్లు, చాక్లెట్లు ఇస్తానని ఆశచూపించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి వారి కాలు విరగొట్టి, తలను పగలుగొట్టేవాడు. ఆ బాధతో చిన్నారులు విలవిలలాడుతుంటే తనకు వారిని అనుభవించాలనే కోరిక కలిగేదని నిందితుడు చెప్పిన మాటలతో పోలీసులు నివ్వెరపోయారు.
నవంబరు 11న బాధిత బాలికను మృగాడు తీసుకెళుతుండగా ఓ హౌసింగ్ సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమేరాల్లో నమోదైంది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత గురుగ్రామ్ బస్ స్టేషన్ సమీపంలోను నిందితుడు సంచరించినట్టు సీసీటీవీ కెమేరాలో చిక్కింది. దీంతో, ఈ దృశ్యాలను ఢిల్లీ, గ్వాలియర్, ఝాన్సీలకు పంపి, చివరకు మాగార్ పుర్ గ్రామంలో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. నిందితుడ్ని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ఎనిమిది రోజుల రిమాండ్ విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more