మీరు ఎల్జీజీ సబ్సీడీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులా.? అయితే ఈ విషయం తెలియకపోతే మీకు ప్రభుత్వం అందించే సబ్సీడి రాయితీ ధర అందదు. మేము సంపన్నులమో లేక సబ్సీడి రాయితీని వద్దనుకున్న వాళ్లమో కాదు.. మాకెందుకు సబ్సీడి వర్తిందరు అని అనుకుంటున్నారా.? మీరు ఎవరన్న విషయాలు ప్రభుత్వానికి తెలియకపోతే ఎలా రాయితీని అందిస్తుంది. ఇక మరో మాటలో చెప్పాలంటే.. ఆధార్ కార్డును ప్రభుత్వ పథకాలతో లింక్ చేయడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించిన క్రమంలో ఇప్పుడు మీ అధార్ కార్డును గ్యాస్ కనెక్షన్ తో అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారింది.
ఇప్పటి వరకు మీ కేవైసీ(నో యువర్ కస్టమర్) వివరాలు తెలియకపర్చనప్పటికీ ప్రభుత్వం మీకు గ్యాస్ సిలిండర్ పై సబ్సీడిని అందించింది. కానీ ఇకపై మాత్రం అలా కుదరదు. ఎందుకంటే ప్రభుత్వం ఇందుకు డెడ్ లైన్ విధించింది. వీలైనంత త్వరగా గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు మీ వివరాలను తెలియజేసే ఆధార్ కార్డును కచ్చితంగా అందించాలి. మీ కస్సూమర్ నెంబరుతో మీ ఆధార్ కార్డును అసుసంధానించి.. మీ బ్యాంకు అకౌంట్ నెంబరు కూడా పోందుపర్చాల్సిందే, లేకుంటే గ్యాస్ సబ్సిడీకి కోత పడే ప్రమాదముంది.
జనవరి 2019 నుంచి ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. కేంద్ర చమురు సంస్థలు ఈ మేరకు డీలర్లకు మౌఖిక ఆదేశాలు ఇచ్చాయి. రాష్ట్రంలో కోటి కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజూ లక్ష దాకా సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ అవుతున్నాయి. సబ్సిడీ దుర్వినియోగం కాకుండా, కనెక్షన్ల డూప్లికేషన్కు అవకాశం లేకుండా చూసేందుకు గ్యాస్ వినియోగదారులు కేవైసీ వివరాలను సంబంధిత డీలర్కు విధిగా అందజేయాలి. అయితే ఈ విషయం చాలా మంది వినియోగదారులకు తెలియదు.
ఆ వివరాలు తీసుకోవాలన్న ఆలోచన కొందరు డిస్ర్టిబ్యూటర్లకే ఉండదన్న వాదనా ఉంది. గ్యాస్ వినియోగదారుల నుంచి ఈ వివరాలు తీసుకోకుంటే అందుకు బాధ్యత డీలర్లదేనని చమురు కంపెనీలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా కేవైసీ వివరాలు సమర్పించాలంటూ డిస్ట్రిబ్యూటర్లపై చమురు కంపెనీలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో కోటి మంది గ్యాస్ కనెక్షన్దారుల కేవైసీ వివరాలు సేకరించడం సాధ్యం కాదని డిస్ర్టిబ్యూటర్లు చెబుతున్నారు. తొలుత ప్రచారం ద్వారా ఈ అంశంపై వినియోగదారులను చైతన్యపరిచాలని, ఆ తరువాత వివరాలు సేకరిస్తే లక్ష్యసాధన సులువు కాగలదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more