మరో నెల రోజుల తరువాత వెలువడనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వే ఎలా వుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో కనీసం నాలుగింట తామే గెలుస్తామన్న కాంగ్రెస్ పార్టీ ధీమా నిజం కానుందా.? లేక మళ్లీ తాము అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న బీజేపి ఆశలు నిలువనున్నాయా.? అన్న విషయమై త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ‘ఇండియా టుడే’కు చెందిన ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్’(పీఎస్ఈ) నిర్వహించిన సర్వే ఫలితాలు తమ అంచనాలను వెలువరించాయి.
తెలంగాణ
తెలంగాణలో కారు స్పీడు పెంచిందని, కేసీఆర్ ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఆ ప్రభుత్వాన్ని తిరిగి అధికారాన్ని అందించనున్నాయని సర్వే తేల్చింది. 44 శాతం మంది కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా, 34 శాతం మంది ప్రభుత్వ మారాలని అభిప్రాయపడ్డారు. ఈ గణాంకాల ప్రకారం.. టీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించడం ఖాయమని చెన్నై మేథమెటికల్ ఇనిస్టిట్యూట్ కు చెందిన సెఫాలజిస్ట్ రాజీవ్ కరాండికర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం 75 శాతం ఉందన్నారు. కాంగ్రెస్కు మజ్లిస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని, ఆ పార్టీ విజయావకాశాలను మజ్లిస్ దారుణంగా దెబ్బతీస్తుందని పీఎస్ఈ వెల్లడించింది. అయితే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరోమారు పరాభవం ఎదురుకాక తప్పదని ఇండియా టుకే విశ్లేషించింది. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి మాత్రం గతంలో కన్నా అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని కూడా వెల్లడించింది.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్లో శివరాజ్సింగ్ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడమని సర్వే చెప్పుకొచ్చింది. అయితే, బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా ఒకటి నుంచి మూడు శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని పీఎస్ఈ పేర్కొంది. బీఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే మాత్రం విజయం ఖాయమని స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం చౌహాన్ సర్కారుకే ఓటేయగా, 40 శాతం మంది ప్రభుత్వం మారాలని అభిప్రాయపడ్డారు. ఇక్కడ బీజేపీ 116 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
రాజస్థాన్
రాజస్థాన్ లో వసుందర రాజే ప్రభుత్వానికి ఓటర్లు షాక్ ఇవ్వనున్నారని సర్వే తేల్చింది. రాజస్థాన్ లోని బీజేపి ప్రభుత్వంపై మైనారిటీ, నిమ్నవర్గాల్లో ఉన్న ఆగ్రహం చేటు చేస్తుందని సర్వేలో వెల్లడైంది. రాజేకు కేవలం 35 శాతం మాత్రమే అవకాశం ఉందని సర్వే తేల్చింది. రాజస్థాన్ లో కాంగ్రెస్కు 110 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, బీజేపీ 84 స్థానాలకే పరిమితం కానుంది. అశోక్ గెహ్లెట్ వైపు రాష్ట్రంలోని ఎక్కువమంది మొగ్గుచూపారు. అయితే గత నాలుగు పర్యాయాలుగా రాజస్థాన్ లో అధికార మార్పిడి జరుగుతున్న విషయం తెలిసిందే.
చత్తీస్గఢ్
చత్తీస్గఢ్ లో మాత్రం బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పోలిటికల్ స్టాక్ ఎక్స్ చేంజ్ తేల్చింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో కొనసాగుతున్న రమణ్ సింగ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని 55 శాతం మంది కోరుకున్నారు. అయితే ఇక్కడ బీజేపిని ఎందుకు కోరుకుంటున్నారన్న అన్న విషయాలను మాత్రం సర్వేలో పేర్కోనలేదు. ప్రభుత్వ పథకాలు కోసమా.? లేక ప్రభుత్వ పనితీరు నచ్చడంతో.? రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారా.? అన్న విషయాలను సర్వే స్పష్టం చేయలేదు. కాగా, ఇక్కడ బీజేపీకి 56 సీట్లు, కాంగ్రెస్కు 25 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more