శ్రీచిత్ర తిరునాళ్ ఉత్సవం నేపథ్యంలో పటిష్ట భద్రత నడుమ క్రితం రోజు సాయంత్రం తెరుచుకున్న శబరిమల స్వామి అయ్యప్ప ఆలయం వద్ద సోమవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇవాళ అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. శబరిమల సహా పంబ నుంచి పరిసరాల్లోని దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు పోలీసులు 144 సెక్షన్ ను అమలుపర్చినా.. అందోళన కారులు మాత్రం ఆలయంలోనికి మహిళలు అడుగపెట్టరాదని, తమ ఆచార వ్యవహారాలను కాపాడాలని కోరుతూ అందోళనకు దిగారు.
గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తొలిసారిగా తెరుచుకున్న ఆలయానికి జర్నలిస్టులు, అందులోనూ మహిళా జర్నలిస్టులు రావడంతో.. వారి వాహనాలను కూడా ధ్వంసం చేసిన అందోళనకారులు వారిపై కూడా దాడులకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందోళనకారులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ సారి శబరిమల ఆలయానికి జర్నలిస్టులు రాకను కూడా అందోళనకారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అయ్యప్పస్వామికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ఇవాళ శ్రీ చిత్ర తిరునాళ్లను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పంపా నదిలో పుణ్యస్నాలు చేసి, శబరిగిరికి చేరుకుని సన్నిధానంలో స్వామికి ఇరుముళ్లు సమర్పిస్తున్నారు. ఇదే సమయంలో ఈ తిరునాళ్లను కవర్ చేయడంతో పాటు ఉద్రిక్త పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆలయానికి వచ్చిన జర్నలిస్టులపై సన్నిధానం చేరువలో నిరసనకారులు కన్నెర్ర చేశారు. పాత్రికేయులతో పాటు కెమెరామన్ పై కూడా దాడి చేశారు.
ఆ తరువాత కొంత సమయానికి నిషేధిత వయసున్న మహిళ ఆలయంలోకి ప్రవేశించారనే వార్తలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో భక్తులు మరోసారి ఆందోళనకు దిగారు. త్రిశూర్ కు చెందిన లలిత (52) తన కుమారుడితో కలిసి మంగళవారం ఉదయం శబరిమలకు చేరుకున్నారు. ఈ సమయంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా, మీడియాపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ వీడియో జర్నలిస్ట్ గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మహిళతో పాటుగా అమెతో వచ్చిన 19 మంది భక్తుల బృందాన్ని రక్షణగా నిలిచారు.
ఇక అమెను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేస్తున్న సుమారు 200 మంది అందోళనకారులు శరణం అయ్యప్ప అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అమె వయస్సును నిర్థారించుకున్న తరువాత అదే విషయాన్ని అందోళనకారులకు తెలిపారు. అమె నిషేధిత వయస్సను దాటారని, తన మనవడి చోరున్ను (అన్నప్రాసన) కార్యక్రమానికి వచ్చానని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో ఆందోళన విరమించిన భక్తులు, ఆమెను దర్శనానికి అనుమతించారు. ఇక శబరిమలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ 25ఏళ్ల మహిళను పంబవద్ద పోలీసులు నిలిపివేశారు. భర్త, తన ఇద్దరి పిల్లలతో కలిసి వస్తున్న ఆమెను పోలీసులు వెనక్కు పంపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more