జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కల్యాణ్ అలోచనా విధానాలు, పార్టీ సిద్దాంతాలు నచ్చి. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా వున్న అనేక మంది మేధావులు కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. మరీ ముఖ్యంగా తనకు డబ్బుపై వాంఛ లేదని, ఇక సెలబ్రిటీ స్టేటస్ ను అస్వాధిస్తున్న తనకు అధికారంపై మోజు, వ్యామోహాలు కూడా లేవని ఆయన బాహాటంగానే స్పష్టం చేస్తున్నారు.
అయితే కేవలం రాష్ట్ర అభివృద్ది.. తన అభిమానించి ఓ గుర్తింపును ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత మేలు చేయడానికి తాను రాజకీయ అరంగ్రేటం చేశానని కూడా పలు సందర్భాలతో ఆయన కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. అయితే తమ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పర్యావరణ సమతుల్యతను పాటించే అభివృద్దితో పాటు రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజాసంక్షేమే పరమావధిగా.. కులరహిత సమాజంవైపు పయనించేందుకు కృషి చేస్తామని కూడా జనసేనాని తెలిపారు.
పవన్ కల్యాణ్ ఈ విధానాలు, సిద్దాంతాలు నచ్చిన ఎంతో మంది ఆయన పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలని కూడా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి వర్గాల్లోని మేధావులు కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ గతంలో ఇచ్చిన పిలుపును అందుకుని ఎంతోమంది ఆయన పార్టీలో చేరారు. తాజాగా..గుంటూరుకు చెందిన విశ్రాంత న్యాయమూర్తి టీఎస్ రావు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లో పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతరం టీఎస్ రావు మాట్లాడుతూ.. పవన్ ప్రకటించిన విజన్ డాక్యుమెంటులోని అంశాలు, జనసేన ఏడు సిద్ధాంతాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు అవసరమని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. రైతు సమస్యలు, భూ సంస్కరణల అమలు తీరుపై తనకున్న అవగాహన, అనుభవాన్ని పార్టీ కోసం వినియోగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more