రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా వచ్చిన జనసేన పార్టీ.. వామపక్ష పార్టీలతో కలసి రాష్ట్ర ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో అప్పుడే ఆ పార్టీ అటు జాతీయ రాజకీయాలపై కూడా దృష్టి మళ్లించింది. ఈ క్రమంలో జనసేనాని ఇవాళ ఉదయం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో చేరుకున్నారు. ఏ మాత్రం ముందస్తు సమాచారం ఇటు మీడియాకు కానీ అటు పార్టీ ప్రతినిధులకు కానీ ఇవ్వకుండా పవన్ నేరుగా లక్నోకు చేరుకున్నారు.
పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, పలువురు జనసేన ప్రతినిధులు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు కూడా లక్నోకు వెళ్లారు. అక్కడ వీరందరితో కలసి పవన్ కల్యాణ్ బీఎస్పీ అధినేత మాయావతితో భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాగస్వామ్య పక్షాల కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతి పేరు వినిపిస్తుండడంతో భవిషత్ రాజకీయాలపై జాతీయ నాయకులతో చర్చించాలని పవన్ నిర్ణయించిట్లు తెలుస్తుంది.
లక్నోలో పలు పార్టీల ముఖ్య నేతలతో జరిగే సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన అఖిలేష్ యాదవ్ తోనూ భేటీ అవుతారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరితో పాటు జనసేనాని మరికొందరు నేతలనూ కలుస్తారని తెలుస్తోంది. వీరిమధ్య సాగే చర్చలపై ఎటువంటి సమాచారం లేకున్నా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రారంభించాలని చూస్తున్న రాజకీయ పార్టీల కూటమిపై చర్చించేందుకు పవన్ వెళ్లినట్టు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్తో బీఎస్పీ విభేదిస్తుందన్న వార్తల నేపథ్యంలో భేటి కావడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more