ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొలువుదీరిన యోగీ అధిత్యనాథ్ ప్రభుత్వంపై అనేక విమర్శలు, అరోపణలు వస్తున్న క్రమంలో కాషాయ ప్రభుత్వంపై మరింత మకిలీ అంటేలా చేస్తున్నారు అక్కడి మంతివర్యులు. ఎవరాయన, ఆయన చేసిన పనేంటి అంటే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రి సతీశ్ మహానా. దేశంలోని కడు పేదలకు, బీద ప్రజలకు మాత్రమే వర్తించే కేంద్ర ప్రభుత్వ పథకంలో ఆయన తన కుటుంబ సభ్యుల పేర్లను కూడా చేర్చారు. దీంతో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎంత పేదవారో ఇట్టే తెలిసిపోతుంది.
విషయంలోకి ఎంటరైతే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ గత నెల 25 నుంచి ప్రారంభమైంది. ఈ పథకం కింద దేశంలోనే అనేక మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్సలను అందించనుంది. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఈ పథకంలో మంత్రి సతీశ్ తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.
లబ్ధిదారుల జాబితాలోకి మంత్రి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశించినట్టు మౌర్య తెలిపారు. మంత్రి పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కనీస వైద్యం చికిత్స కోసం కూడా ఖర్చు చేయలేని వారి కోసమే ఈ కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి వివరించారు. ఈ పథకం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more