విశాఖ ఏజెన్సీలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అత్యంత కిరాతకంగా హత్యచేయడానికి కారణం పోలీసుల నిర్లక్ష్యమేనని ఉన్నతాధికారులు విచారణలో వెల్లడైంది. ప్రాథమిక విచారణలో పోలీసులు ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ గా వచ్చి వుంటే ఇంత దారుణం జరిగివుండేది కాదన్న విషయాన్ని స్థానికులు అరోపించడంతో ఈ దిశగా విచారణ జరిపిన ఉన్నతాధికారులు డుంబ్రిగూడ ఎస్ఐపై వేటు వేశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తన పర్యటనపై ముందస్తు సమాచారం ఇచ్చినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమ్మెల్యే అనుచరులు చెప్పడంపై ప్రభుత్వం స్పందించింది. డుంబ్రిగూడ ఎస్సై అమ్మన రావును సస్పెండ్ చేసింది. కిడారి, సోమల హత్యల తర్వాత చెలరేగిన అల్లర్లను అదుపు చేయడంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని ప్రాథమిక విచారణలో తేలడంతో వీరిపై వేటువేసినట్లు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని చెప్పారు.
పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ నాయకులు చనిపోయారన్న ఆగ్రహంతో అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై వారి అనుచరులు దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఔట్ పోస్ట్ ను తగలబెట్టారు. ఫర్నీచర్, ఫైళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. దొరికిన పోలీసులను దొరికినట్లు కొట్టారు. ఈ క్రమంలో రేగిన ఉద్రిక్తత రాత్రికి కానీ చల్లబడలేదు. కాగా ఇవాళ కిడారి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించనున్నట్లు కూడా ప్రభుత్వం పేర్కోంది.
తమ నాయకులను మావోయిస్టులు అక్రమంగా పొట్టన పెట్టుకున్నారని అక్రోశంతో పోలీసులపై దాడులు చేసిన స్థానికులు.. వారి హత్యలకు నిరసనగా రెండు రోజుల పాటు మన్యంలో బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో నేడు, రేపు.. రెండ్రోజుల పాటు బంద్ కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. కిడారి, సోమల హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, మావోయిస్టులను ఏరివేసేందుకు విశాఖ మన్యంలో 12 స్పెషల్ పార్టీ పోలీసుల బృందాలు, 8 గ్రేహౌండ్స్ పార్టీలు కూంబింగ్ ప్రారంభించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more