నల్గోండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన దారుణ పరువు హత్యను సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండిస్తున్న క్రమంలో హైదరాబాదులో మరో మారుతిరావు ఘటన పెను సంచలనంగా మారింది. నల్గొండ ఘటన తాలుకు విషాదాన్ని నవసమాజం దిగమింగుకునేలోపు మరో మారుతిరావ్ తన కూతురు ప్రేమ పెళ్లిపై కత్తికట్టాడు. తన కూతురి, అల్లుడి వున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన నేరుగా అక్కడి వచ్చి వారితో మాట్లాడుతున్నట్లుగా నటించి తన వెంట తెచ్చుకున్న కత్తితో కొత్తజంటపై దాడి చేశాడు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన అతని కూతురు పరిస్థితి విషమంగా వుంది.
వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన మాధవి.. ఎర్రగడ్డకు ప్రేమ్ నగర్ కాలనికి చెందిన నవదీప్ ఇద్దరు పదో తరగతి నుంచి ఒకరినోకరు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో వారు మేజర్లు అయిన తరువాత వారు నెల రోజుల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో తన కూతురు ప్రేమ వివాహం చేసుకోవడం జీర్ణించుకోలేని తండ్రిని నల్గోండ జిల్లాలో మారుతిరావ్ ఘటన రెచ్చగోట్టింది. దీంతో కిరాయి హంతకులు వగైరా లేకుండా మారుతిరావును మించిన కసాయి తండ్రిగా మారిన కర్కశుడు ఎప్పటికప్పుడు తన కూతురి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
ఇవాళ తన కూతురు అల్లుడితో కలసి షాపింగ్ కని బైక్ పై వెళ్తున్న సమాచారం తెలుసుకున్న తండ్రి నేరుగా అక్కడికి వచ్చిన మనోహరచారి.. వారితో మాట్లాడుతున్నట్లుగా నటించి.. తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి నేరుగా తన అల్లుడు నవదీప్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పారిణామంలో గాయాలపాలైన నవదీప్ వెంటనే కోలుకుని మనోహరచారిని నెట్టేసి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అయితే తన కూతురుకు ఏ హానీ చేయడని భావించిన నవదీప్ అంచనాలు తప్పయ్యాయి.
తనతో పాటు నవదీప్ నెట్టివేయడంతో పడిపోయిన తన కూతరు మాధవిని చూసిన మనోహరచారి.. తనలోని అవేశాన్ని అణుచుకోలేక అమెపై అదే కత్తితో దాడికి పాల్పడ్డాడు. తొలుత దాడి చేస్తుండగా చేయి అడ్డంపెట్టిన మాధవిపై చేయిని అత్యంత కసాయిగా నరికివేశాడు. ఆ తరువాత బాధను తట్టుకోలేక వంగిపోయిన తన కూతురిని.. చూసినా అతనిలో కనికరం లేదు. అదే అవేశంతో మళ్లి కూతురి వద్దకు వచ్చి మళ్లీ మెడపై వేటు వేశాడు. దీంతో మాధవి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
ఆ తరువాత స్థానికులు మనోహరచారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఓ స్థానికుడు వెనుకగా వచ్చి ఎగిరి తన్నాడు. అయితే చేతిలో కత్తి వుండటంతో ఆయన ఎదుర్కోనే ధైర్యం చేయలేకపోయారు స్థానికులు. హుటాహుటిన బాధితురాలు మాధవిని స్థానికంగా వున్న నీలిమా అసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా వుండటంతో అమెను యశోధా అస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. కాగా నవదీప్ ను నీలిమా అస్పత్రిలోనే చికిత్స పోందుతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న మనోహరచారి కోసం వేట కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more