బీజేపి కార్యకర్తల స్వామి భక్తి పరాకాష్టకు చేరిందా.? అంటే ఈ సంఘటన అవుననే అంటుంది. ఏకంగా తమ పార్టీ ఎంపీ కాళ్లు కడిగిన ఓ కార్యకర్త.. చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశమైంది. అది చాలదన్నట్లు ఆ సంఘటనను తన ఫేస్ బుక్ ప్రోఫైల్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇంకేముంది.. సదరు ఎంపీని సాధించిన ఘనత అంతా ఈ చిన్న ఘటన కొట్టిపారేస్తూ ఆయనను విమర్శల పాలుజేసింది.
నాయకులు అభిమానులను హద్దుల్లో వుంచుకోవాలి. అంతేకానీ వారు హద్దు మీరి చేసే పనులు కూడా నేతలను అబాసుపాలు చేస్తాయని ఈ ఘటన నిరూపిస్తుంది. తాజాగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గొడ్డా పార్లమెంటు సభ్యుడు నిషికాంత్ దూబే పై ఆయన అనుచరుడి అభిమానం హద్దులు దాటింది. బీజేపి కార్యకర్త తన స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నంలో భఆగంగా ఎంపీ కాళ్లు కడిగారు. ఇంతవరకు ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత ఆయన చేసిన పనే దూబేను విమర్శలపాలు చేస్తుంది.
వివరాల్లోకి వెళితే..జార్ఖండ్కు చెందిన గొడ్డా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ సింగ్ అనే కార్యకర్త సభకు హాజరైన వందలాది మంది సాక్షిగా...ఎంపీ కాళ్లు కడిగి, అనంతరం ఆ నీళ్లను పవిత్ర గంగాజలంగా సేవించాడు. ఈ తతంగాన్ని అంతా ఓ కార్యకర్త వీడియో తీయడం, దానిని నెటింట్లో పోస్టు చేయడంతో కూడా పెద్దగా వైరల్ కాలేదు. అయితే ఈ వీడియోను ఎంపీ తన ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది.
అయితే బీజేపి పార్టీకి చెందిన ఎంపీ మాత్రం తన కాళ్లు కడగడాన్ని సమర్థించుకున్నారు. ఆ పాదపూజపై పలువురు సమర్థించినా, పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ చర్యను ఎందుకు రాజకీయ రంగు పులుముతారంటూ, అతిథుల కాళ్లు కడగటం మన సంప్రదాయమని, పురాణాల్లో కూడా ఉందంటూ ఎంపీ నిషికాంత్ దూబే చెప్పుకొచ్చారు. చవకబారు ఆలోచనలు చేయడం సరికాదని, కాళ్లు కడిగిన నీటిని తాగడంలోనూ ఏమాత్రం తప్పులేదని ఎంపీ వ్యాఖ్యానించారు.
#WATCH BJP worker washes feet of BJP Godda MP Nishikant Dubey and drinks that water, at an event in Jharkhand's Godda (16.09.18) pic.twitter.com/J2YwazQDhg
— ANI (@ANI) September 17, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more