అనారోగ్యంతో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం పారికర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారని గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. పారికర్ ఆరోగ్య సమస్యల దృష్ట్యా తరచూ ఆయన విధులకు సెలవు పెట్టాల్సి వస్తోంది. దీంతో పాలనా పగ్గాలను తాను ఇతరులకు అప్పగించేందుకు కూడా సుముఖమని వెళ్లడించినట్లు వార్తలు వెల్లడవుతున్నాయి.
ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షాతో చర్చించినట్లు సమాచారం. ముందుగా తన అరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలని హితవు పలికిన ప్రధాని ఆయనను ఎయిమ్స్ అసుపత్రికి రావాలని.. ఇక్కడ నిపుణులైన వైద్యులతో చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు పారికర్ ను ఎయిమ్స్ అసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రి పారికర్ అనారోగ్యం కారణంగా పాలన వ్యవస్థ దెబ్బతింటోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వెంటనే గోవాలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది.
ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం తాను సీఎంగా కొనసాగలేనని పారికర్.. మోదీ, అమిత్షాలను చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం కాస్త కష్టమని, అందుకే తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు సీఎంగా కొనసాగాలని పారికర్కు అమిత్షా సూచించినట్లు తెలుస్తోంది. ప్యాంక్రియాటిక్ సమస్యతో బాధపడుతున్న పారికర్ ప్రస్తుతం గోవాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలోనూ చికిత్స తీసుకున్న ఆయన.. అమెరికాకు కూడా వెళ్లి మూడు నెలలపాటు వైద్యం తీసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more