శాంతిసామరస్యాలకు ప్రతికగా నిలుస్తూ.. భారత దేశ రెండో రాజధానిగా బాసిల్లేందుకు అన్ని అర్హతలు సంపాదించిన హైదరాబాద్ మహానగరం.. శరవేగంగా అభివృధ్దిలో పరుగులు తీస్తున్న క్రమంలో జరిగిన జంటపేలుళ్ల కేసు పెను విషాధాన్ని నింపింది. 2007లో ఆగస్టు 25న గోకుల్ చాట్, లుంబినీ పార్క్ లో జరిగిన పేలుళ్ల ఘటనలో జరిగిన ఈ జంటపేలుళ్ల కేసులో 44 మంది అసువులు బాయగా, అరవైకి పైగా మంది క్షతగాత్రులుగా మారారు. ఇప్పటికీ ఈ బాధితుల్లో కొందరు జీవచ్ఛవాలుగానే బతుకులీడుస్తూ.. న్యాయస్థానంలో తమకు న్యాయం జరగాలని ఉత్కంఠగా గత పదకొండేళ్లుగా నిరీక్షిస్తున్నారు.
ఎట్టకేలకు వారి నిరీక్షణకు న్యాయస్థానం తెరదించుతూ ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇప్పటికే సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఇద్దరిని నిర్ధోషులుగా పరిగణించిన న్యాయస్థానం వారిని విడిచిపెట్టగా, మరో ఇద్దరిని మాత్రం దోషులుగా నిర్థారించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ ఉదయం నిందితులకు ఆశ్రయం కల్పించిన మరో నిందితుడిని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. దోషులకు ఆశ్రయం కల్పించిన తారిఖ్ అంజుమ్ ను దోషిగా తేలుస్తూ ఇవాళ తీర్పును వెలువరించింది.
దీంతో ఈ కేసులో దోషుల సంఖ్య మూడుకు చేరింది. గత వారం ఏ-1 నిందితుడు అనీక్ షరీఫ్, ఏ-2 నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ లను కోర్టు దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా కొద్ది సేపటి క్రితం ఈ ముగ్గురు దోషులకు ప్రత్యేక కోర్టు శిక్షను ఖరారు చేసింది. 44 మంది మరణాలకు కారణమైన ఏ1, ఏ2 నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ శిక్షను ఖారారు చేసింది. కాగా, దోషులకు ఆశ్రయం కల్పించిన తారిఖ్ అంజుమ్ కు జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అయితే న్యాయస్థానం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత కుటంబాలు.. ఈ కేసులో వున్న అందరి నిందితులకు శిక్షలు పడటంతోనే తమకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more