దేశంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒకప్పుడు తప్పుడు వార్తలను బాగా ప్రచారం చేసి.. తమ ఉత్పత్తులకు ఆదరణ లభించేలా చేసుకున్నారు. తీరా ఒక తరం మారిన తరువాత అప్పడు తప్పని చెప్పిన ప్రచారాలను.. ఇవాళ ఒప్పని చెబుతూ.. వాటి గురించి మనకు తెలిసిన విషయాలనే కొత్తగా చెబుతూ ఇలా మరోమారు తమ ఉత్పత్తులకు డిమాండ్ ను పేంచేసుకుంటున్నారు.
ఓ దంత మంజన్, టూత్ పేస్ట్ సంస్థ గతంలో బొగ్గుతో దంతాలను శుభ్రం చేసుకోవడం సముచితం కాదని కూడా ప్రకటనలు గుప్పించాయి. తాజాగా అదే మంచిదని ప్రచారాన్ని చేసుకోవడం కొసమెరుపు. మీ టూత్ పేస్టులో బోగ్గు వుందా.. ఉప్పు వుందా.. అంటూ ప్రచారాన్ని ఊదరగొడుతుంది. అయితే అప్పట్లో మనవాళ్లకు అంతగా అవగాహన లేక.. దానిని వ్యతిరేకించిన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా సామాజిక మాద్యమాలు కూడా లేక బహుళజాతి సంస్థల ప్రచారాన్ని ప్రజల మెదళ్లలోకి బలవంతంగా వెళ్లేలా చేసి.. తమ ఉత్పత్తులకు డిమాండ్లు పెరిగేలా చేసుకున్నాయి.
తాజాగా మన సంస్కృతిలో భాగమైన కొబ్బరి నూనెపై కూడా విషం చిమ్ముతున్నారు. తలంటుకున్న ప్రతీసారి అందుకుముందు తలకు మంచిగా కొబ్బరినూనెను పట్టించడం దాదాపుగా అందరూ చేసే పని. కొబ్బరినూనెతో వెంట్రుకలు వత్తుగా, చక్కగా, పొడుగ్గా, పెరుగుతాయని, ఇక ఇదే నూనెతో శరీరాన్ని మర్థనం చేయడం వల్ల శరీరం కూడా నిగారిస్తుందని కూడా పెద్దలు చెబుతారు. ఇక పచ్చి కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయన్నది నిపుణులు మాట. కానీ హార్వర్డ్ కు చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ మాత్రం చిత్రమైన వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కొబ్బరి నూనె పచ్చి విషమనీ, దానికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.
ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సమావేశంలో హార్వర్డ్ వర్సిటీకి చెందిన కరిన్ మిచెల్స్ అనే మహిళా ప్రొఫెసర్ ఈ వ్యాఖ్యలు చేసింది. కొబ్బరినూనె అన్నది అన్ని రోగకారకాలకు నిలయమని ఆమె వ్యాఖ్యానించింది. దానికి దూరంగా ఉండాలనీ, అది పచ్చి విషమని సెలవిచ్చింది. మనుషుల తీసుకోదగ్గ అత్యంత చెత్త ఆహారం ఇదేనని చెప్పింది.ఈ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా ఇప్పటివరకూ దాదాపు 10 లక్షల మంది చూశారు.
కాగా, కరిన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు. కొబ్బరి నూనె విషం అయితే హవాయి, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ ప్రజలు తరతరాలుగా విషం తీసుకుంటున్నట్లే అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. నందిని అనే మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘భారత్ లో తల్లులు తమ పిల్లలకు కొబ్బరినూనెతో మర్దన చేస్తారు. ప్రజలు తలకు రాసుకుంటారు. ఒక్క అమెరికాలో మాత్రమే ప్రతిదాన్నీ భూతద్దంలో చూస్తున్నారు’ అంటూ మండిపడింది. మిగతా భారతీయుల కంటే కొబ్బరినూనె ఆహారంలో భాగంగా తీసుకున్న ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉందని పంకజ్ అనే మరో నెటిజన్ చురకలంటించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more