హిందూ భావజాల సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆమె ఇప్పటికే దేశ ప్రజలకు పరిచయం కాగా.. ఏకంగా యావత్ దేశాన్ని ఒక్కతాటిపై నడిపించి అంగ్లేయుల గుండెల్లో సింహస్వప్నంగా మారి.. శాంతి, అహింసా మార్గాలను ఆచరించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన జాతిపిత మహాత్మాగాంధీపై అమె విషం చిమ్ముతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
నాథూరామ్ గాడ్సేను తాను ఆరాధిస్తానని, అప్పట్లో మహాత్మాగాంధీని ఆయన చంపకుంటే తానే ఆ పనిచేసే దానినని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే.. అడ్డుకునే గాడ్సే మరొకరు ఉంటారని ఆమె పేర్కొన్నారు. గాడ్సేను తాను ఆరాధిస్తానని, ఆ విషయాన్ని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పుకొచ్చారు. నిజానికి గాంధీని గాడ్సే చంపలేదని తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేలోపే అతడిని శిక్షించారని పూజ వివరించారు.
హిందూ కోర్టు పేరుతో అఖిల భారత హిందూ సభ (ఏబీహెచ్ఎం) ఇటీవల మీరట్లో సొంతంగా వివాదాస్పద న్యాయస్థానాన్ని ప్రారంభించింది. దానికి పూజ శకున్ పాండేను న్యాయమూర్తిగా నియమించింది. ఈ కోర్టులపై ఓపక్క అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, పూజ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ పేరుతో భర్తల చేతిలో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూ ధర్మాన్ని అనుసరించాలని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more