కేరళతో పాటు ఇటు కర్ణాటకలోని కొడుగు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించిందన్న వార్తలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. అయితే ఆయన నిర్వహించిన ఏరియల్ సర్వే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏరియల్ సర్వేపై సోషల్ మీడియాలో మొదటగా విడుదలైన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది కావాలని తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీసిన వీడియోనని, దీంతో తన పాలనను సాగనివ్వకుండా ప్రత్యర్థులు ఎంతలా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో అర్థం చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వర్గాలు అరోపిస్తున్నాయి.
This is the seriousness our CM @hd_kumaraswamy is having in aerial survey facility which is provided to him..Even though our officers are busy doing the survey ,CM is shamelessly reading a newspaper.
— Shobha Karandlaje (@ShobhaBJP) August 20, 2018
Utter waste of tax payers money & a clear insult to #Coorg people #KodaguFloods pic.twitter.com/OscLUWXMuq
ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలో ఓ వైపు భారీ వర్షాలు కుదిపేసి.. పంటలను నాశనం చేస్తూ.. అనేక మందిని నిరాశ్రయులను చేసిన నేపథ్యంలో ఏరియల్ సర్వేకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. హెలికాప్టర్ లో కూర్చోని సర్వే చేయకుండా.. ఎంచక్కా పేపర్ ఎలా చదువుకుంటున్నారో చూశారా?’’ అంటూ ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఏరియల్ సర్వే నిర్వహించకుండా తనకేమీ పట్టదన్నట్లుగా పేపర్ చదువుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇంతకీ ఈ వీడియోల్లో నిజమెంత?
కర్ణాటకలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కొడుగు జిల్లాపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ నెల 19న ఏరియల్ సర్వే నిర్వహించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా తీసిన వీడియోలే ఇవి. అందులో కుమార స్వామితో పాటు మరో ఇద్దరు కూడా వీడియోలో ఉన్నారు. ‘‘పేపర్ చదవడానికే అయితే హెలికాప్టర్ ఎక్కడమెందుకో’’ అంటూ కామెంట్లతో ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అదునుగా భావించిన ఇతర పార్టీ నేతలు వాటిని రీట్వీట్ కూడా చేశారు.
#KarnatakaFloods | #ChiefMinister @hd_kumaraswamy conducting an aerial survey of rain hit #Kodagu district. #KodaguFloods #KodaguFloodRelief pic.twitter.com/j28fubLIEU
— Deccan Herald (@DeccanHerald) August 18, 2018
మైసూరు నుంచి ఏరియల్ సర్వేకు హెలికాప్టర్ ఎక్కిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి పేపర్ చదువుతుండగా తీసినవే ఆ దృశ్యాలని మీడియా కార్యదర్శి వివరణ ఇచ్చారు. అంటే గమ్యస్థానానికి చేరకముందు తీసిన దృశ్యాలు అన్నమాట. ఆ తర్వాత కొడుగు జిల్లాకు చేరుకున్నాక ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ దృశ్యాలను ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఉంచింది. అయినప్పటికీ కొందరు పనిగట్టుకుని ఈ అసత్య ప్రచారానికి తెర తీశారని జేడీఎస్ పార్టీ నేతలు విమర్శించారు.
ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಇಂದು ಮುಖ್ಯಮಂತ್ರಿ ಹೆಚ್.ಡಿ. ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರಿಗೆ ಕರೆ ಮಾಡಿ ಕೊಡಗು ಜಿಲ್ಲೆಯ ಸ್ಥಿತಿ ಗತಿ ಹಾಗೂ ಪರಿಹಾರ ಕಾರ್ಯಾಚರಣೆ ಕುರಿತು ಮಾಹಿತಿ ಪಡೆದು ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವು ರಕ್ಷಣೆಗೆ ಹಾಗೂ ಪರಿಹಾರ ಕಾರ್ಯಗಳಿಗೆ ಎಲ್ಲ ರೀತಿಯ ನೆರವು ನೀಡುವುದಾಗಿ ಭರವಸೆ ನೀಡಿದರು.#KarnatakaRains#KodaguFloods pic.twitter.com/0rSoc9uioS
— CM of Karnataka (@CMofKarnataka) August 19, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more