దేశంలో త్వరలోనే పోర్టబుల్ పెట్రోల్ పంపులు అందుబాటులోకి రానున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఏ దేశ సాంకేతిక సహాయాన్ని పోంది మన దేశం బిహెచ్ఇఎల్ లాంటి భారీ పరిశ్రమలను నెలకొల్పిందో అదే దేశం చెక్ రిపబ్లిక్ లోని సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో తాజాగా పోర్టబుల్ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు కేంద్ర పచ్చజెండాను ఊపింది. పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ఇంధనం సమకూర్చే ఫిల్లింగ్ స్టేషన్ లలో పోర్టబుల్ డిజైన్ తో అలింజ్ గ్రూప్ సంస్థ ముందుకువచ్చింది.
కొన్నేళ్లుగా చేసిన ప్రయత్నాలు ఫలించి.. ప్రభుత్వ అనుమతి పొంది పోర్టబుల్ పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధమైంది. అత్యాధునిక పద్దతులతో ఎంపిక చేసుకున్న స్థలంలో కేవలం రెండు గంటల్లోనే ఈ పెట్రోల్ బంక్ ను ఏర్పాటు చేస్తారు. 10 వేల లీటర్ల సామర్థ్యం నుంచి 35 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకులతో ఈ స్టేషన్ లో ఇన్ స్టాల్ చేస్తారు. 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పుతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ట్యాంక్ సామర్థ్యాన్ని బట్టి స్థలం అవసరం అవుతుంది.
పెట్రోల్, డీజిల్ లను ట్యాంకులో ఉన్న పార్టిషియన్ లో నింపుకోవడానికి వీలుగా ఉంటుంది. సీసీ కెమెరాలు, డిజిటల్ చెల్లింపులకు అనుకూలంగా ఈ పోర్టబుల్ పెట్రోల్ పంపులను డిజైన్ చేశారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలతో సంప్రదింపులు జరిపామని, దేశమంతటా ఇలాంటి పెట్రోల్ పంపులను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అలింజ్ సంస్థ ఎండీ ఇంద్రజిత్ తెలిపారు. త్వరలోనే ఎల్పీజీ సంబంధించిన పోర్టబుల్ పంపులను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more