అరబ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో రాజరిక పాలనకు వ్యతిరేకంగా.. గళం విప్పి.. ప్రజాస్వామ్య వాదంకోసం గళం విప్పిన ఓ ధీరనారి అమరురాలైంది. ప్రజాస్వామ్యమే ప్రజలకు శ్రీరామ రక్ష అని భావించి ఆ దిశగా శాంతియుతంగా ప్రచారం చేస్తూ.. పోరాటానికి నాంది పలికిన ఓ మహిళా హక్కుల కార్యకర్తకు.. అ దేశంలోని రాచరిక పాలన బహిరంగంగా మరణ దండన అమలు చేశారు. ఈ శిక్షలో భాగంగా ఆమెకు శిరచ్ఛేదనం చేశారు. మహిళా కోర్టు న్యాయమూర్తి మరణ దండన విధించడంతో ఆ మహిళా కార్యకర్తకు ఈ తరహా శిక్షను అమలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సౌదీలో మహిళా హక్కుల పోరాటం చేసే కార్యకర్తల్లో ఒకరు ఎస్రా అల్ ఘంఘం. ఈమెను గత 2015 డిసెంబరు 8వ తేదీన ఆ దేశ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ఆమె భర్త కూడా పక్కనే ఉన్నారు. షియాల ప్రాబల్యం ఉన్న ఖతీఫ్ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా, రాజకీయ నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని శాంతియుతంగా నిరసనగా ప్రదర్శనలను ఎస్రా అల్-ఘంఘం నిర్వహించేది.
ఈ చర్యలను అరేబియా సర్కారు తోసిపుచ్చుతూ ఆమెపై రాజద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అభియోగం మోపారు. అమెను గత మూడేళ్ళుగా కారాగారంలో బంధించి అనేక అవస్థలకు గురిచేశారు. అటు రాజరికపు పాలనకు ఎదురోడ్డి అమెకు మద్దతుగా న్యాయవాదిని కూడా పెట్టుకోలేని స్థితిలోకి ఘంఘం కుటుంబ వెళ్లింది. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా లేకపోడంతో అమె తరపున వాదించడానికి న్యాయవాదులు ఎవరూ ముందుకురాలేకపోయారు. దీంతో ప్రభుత్వం ఏకపక్షంగా ఆమెకు బహిరంగ శిరచ్ఛేద మరణశిక్ష విధించింది.
శిక్ష అములులో భాగంగా తలారి ఆమె తలను నేలకు తాకేలా సరిగ్గా అమర్చి కత్తితో ఒక వేటుకి నరికేశాడు. నాలుగు రోడ్ల కూడలిలో భద్రతా బలగాల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగా ఈ శిక్షను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సౌదీ అరేబియాకు కొత్త రాజుగా ఎన్నికైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలు చేపడుతూ దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకొంటున్న సమయంలో ఘంఘం శిరచ్ఛేదం జరగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more