ధనం మూలం ఇదం జగత్ అన్న సూక్తి ప్రస్తుతం అన్ని వర్గాల వారు తమ శక్తి కొలది పాటిస్తున్నారని తెలుసు కానీ.. తమ కన్నబిడ్డ మరో తరానికి నాంది పలుకుతున్న శుభ తరుణంలో మాత్రం శక్తికొలది డబ్బును వెచ్చించి మరీ ఖర్చుపెట్టి ఘనంగా కల్యాణ కార్యక్రమాన్ని జరిపిస్తారన్నది తెలిసిందే. అయితే ఇక్కడ జరిగింది మాత్రం వేరు. కేవలం మూడంటే మూడు వేల కోసం మొదలైన ఓ చిన్న గొడవ.. మూడుముళ్ల బంధంతో ఒకటి కావాల్సిన వధూవరులను విడదీసింది. ధనం శక్తి ముందు ఏ శక్తి మనజాలదని మరోసారి రుజువుచేస్తూ.. వధూవరులను ఎవరిదారిన వారు వెళ్లడానికి కారణమైంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరులో జరిగిందీ ఆసక్తికర సంఘటన.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, పలమనేరు పట్టణానికి చెందిన యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 19 ఆదివారం రోజున ఉదయం పెళ్లికి ముహుర్తం కూడా నిర్ణయించారు. పెళ్లికి కావల్సిన అన్ని ఏర్పాట్లను అంగరంగ వైభవంగా పూర్తి చేశారు. అయితే పెళ్లి సమయంలో వరుడికి ఓ బంగారు ఉంగరం పెడతామని వధువు తల్లిదండ్రులు నిశ్చితార్థం సమయంలో ఒప్పుకున్నారు. సరిగ్గా ముహుర్త సమయానికి బంగారు ఉంగరం పెట్టాల్సిందేనంటూ, వరుడి తరుపు బంధువులు పట్టుబట్టారు. అయితే ఇంతకుముందు పెళ్లి బట్టల షాపింగ్ సమయంలో వరుడు, వధువు కుటుంబం నుంచి మూడు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. కానీ పెళ్లి నాటికి కూడా తిరిగి చెల్లించలేదు.
వరుడి బంధువులు ఉంగరం కోసం పట్టబట్టగా.. ఆ డబ్బును తిరిగి చెల్లిస్తేనే ఉంగరం పెడతామని వధువు తరుపు బంధువులు తేల్చిచెచెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. మాటా మాటాపెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రూ. 3 వేల కోసం ఇంత రాద్ధాంతం జరగడంతో పెళ్లికొడుకూ, పెళ్లి కూతురు కూడా గొడవ పడి ఇద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. సర్దిచెప్పడానికి కొందరు బంధువులు ప్రయత్నించినా, సఫలం కాలేదు. వధూవరులు ఎవరిదారిని వారు వెళ్లిపోయారు. బంధువులు కూడా వారిని అనుకరించారు. దీంతో లక్షలు ఖర్చుపెట్టి చేసిన పెళ్లి ఏర్పాట్లు, కేవలం మూడు వేల రూపాయల కారణంగా వృథా అయిపోయాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more