పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం ప్రతిభింభమని ఓ వైపు అధికార పార్టీకి చెందిన నాయకులు ఊదరగోడుతున్నా.. అవినీతి, లంచగొండితనం అంశాలకు సంబంధించి 'సెంటర్ ఫర్ మీడియా స్టడీస్-సీఎంఎస్' నిర్వహించిన సర్వేలో తెలంగాణ రాష్ట్రం ఏకంగా రెండో స్థానాన్ని సంపాదించిందని బయటపెట్టింది. అయినా అదేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం అధికారులు అవినీతిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారిని వెనకేసుకువచ్చే పనులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మరోమారు అధికారుల పనితీరును తెలంగాణ ప్రభుత్వ ప్రచార ప్రకటనలు బయటపెట్టాయి.
తెలంగాణ ప్రభుత్వం పరువును బజారుకు ఈడ్చేలా.. ఓ అభంశుభం తెలియని అమాయకురాలికి తన భర్త ఎవరో తెల్చుకోమ్మని పరీక్షను విధించేలా చేసింది తెలంగాణ సర్కార్. అసలు ఏ మాత్రం భూమి కూడా లేని తమకు భూమి ఉందంటూ.. రైతు భీమా అందినట్లు చూపించే ఒక ఫోటో తెలంగాణ ప్రచారపర్వంలో వున్న డొల్లతనాన్ని బయటపెడుతుంది. ఇక కంటి వెలుగు అనే కార్యక్రమానికి ప్రకటనలో అదే మహిళ.. అదే బిడ్డ.. కానీ భర్త మాత్రం మారిపోయాడు. దీంతో సదరు మహిళ అటు కుటుంబంలోనూ.. ఇటు బంధువులలోనూ సూటిపోటి మాటలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
తన అనుమతి లేకుండా, తెలంగాణ ప్రభుత్వ ప్రకటనల్లో తన భర్తగా వేరొకరిని చూపడాన్ని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగ్రాయికి చెందిన మహిళ పద్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కంటివెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ సర్కారు పేపర్లలో ప్రకటనలు ఇచ్చిన వేళ, కొన్ని ప్రకటనల్లో పద్మ భర్తగా ఒకరిని, మరికొన్ని ప్రకటనల్లో ఇంకొకరిని చూపించారు. తన భర్త ఫొటోను మార్చడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం యాదగిరి సమీపంలోని కొంగవల్లిలో ఉంటున్న తమ వద్దకు వచ్చి మూడు సంవత్సరాల క్రితం కొందరు ఫొటోలు తీసుకున్నారని ఆమె గుర్తు చేసుకుంది.
ఆపై తాము కాపుసారా కాచుకుని, దాన్ని తాగేవాళ్లమని, ఇప్పుడు సారా కాయడం లేదని, ఆనందంగా ఉన్నామని చెబుతూ పేపర్లో ప్రకటన ఇచ్చారని, ఆ తరువాత రైతు బంధు పథకం పెట్టిన సమయంలో తమకు పొలం ఉందని, రూ. 4 వేలు ప్రభుత్వం నుంచి అందుకుని ఆనందంగా ఉన్నామని మరో ప్రకటన వేశారని తెలిపింది. కంటివెలుగు ప్రారంభం సమయంలో తన భర్త ఫొటో బదులు వేరొకరి ఫొటో పెట్టారని ఆమె ఆరోపించింది. దాన్ని చూసిన చాలామంది తమను గేలి చేసి మాట్లాడుతున్నారని విలపించిన ఆమె, తాను తలెత్తుకు తిరగలేకపోతున్నానని వాపోయింది. తమకు పొలం లేదని, అయినా చెక్కులిచ్చినట్టు చూపించారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more