కేరళ రాష్ట్రంపై పగబట్టిన వరుణుడు.. గత పది రోజులుగా ఏకధాటిగా కురుస్తూ తన ప్రతాపాన్ని చాటుతన్న విషయం తెలిసిందే. కేరళవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలదిగ్భంధనంలో చిక్కుకోగా.. దాదాపుగా 14 జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఓ వైపు వరదలు మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఎటుచూసినా మళయాలీయుల కన్నీటి సంధ్రంగా మారింది. నగరాలు, పట్టణాలు కూడా నదులై పారుతున్నాయి. అదివారం నుంచి కొంత ఉపశమనం లభిస్తున్న వార్తలో అశలు కడలితో తేలిన మళయాలీయులపై వరుణుడి ప్రకోపం కొనసాగుతుంది.
తాజాగా వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేరళలో ఇవాళ ఉదయం అత్యవసర అప్రమత్త పరిస్థితిని ఉపసంహరించుకున్న 14 జిల్లాలలో.. మళ్లీ 11 జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాలు సుమారుగా 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసుకోనుందని వార్తలతో కేరళ సర్కార్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు 11 జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తాయన్న వార్తతో మళయాళీయులు కలవరం చెందుతున్నారు.
దీంతో వర్షా ప్రభావిత జిల్లాలోకి యుద్దప్రాతిపదికన సహాయ చర్యలు అందించేందుకు మరికొంత కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ నేత పీసీ చాకో అన్నారు. గత పది రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారని అన్నారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి తీవ్రంగా ఉంది. అత్యవసరంగా బాధితులను తరలించేందుకు మరిన్ని చర్యలు అవసరం. చేసినంతవరకూ అభినందనీయమే అయినా కేరళతో పాటు వరద బాధిత రాష్ట్రాలకు కేంద్రం మరింత సాయం అందించాలి అని చాకో కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more