సాధారణంగా అన్నం వేడివేడిగా తినాలనుకునే వారు వండివార్చిన తరువాత కానీ తినలేరు. మూడు దశాబ్దాల క్రితం కట్టెల పోయిలపై వండివార్చితే.. అందుకు సుమారు 45 నిమిషాల సమయం పట్టేంది. కాగా ప్రస్తుతం అటు స్టౌ పై వండితే 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక తాజాగా అందులోకి వచ్చిన రైస్ కుక్కర్లలో వండివార్చాలంటే సగానికి సగం సమయం తగ్గిపోతుంది. అయితే అసోంలో పండించే ఓ రకం బియ్యాన్ని వండకుండానే తినేయ్యొచ్చు. అయితే అలా తినడానికి ముందు మాత్రం ఓ గంట సమయం తప్పక బియ్యం నానబెట్టాలన్న కండీషన్ వుంది.
ఏంటీ.. ఎలాంటి గ్యాస్ స్టౌ, రైస్ కుక్కర్ అవసరం లేకుండా బియ్యాన్ని నానబెట్టడంతోనే ఉడికినట్టుగా తయారై తినడానికి సిద్దంగా మారిపోతుందా.? అంటే ఔననే అంటున్నారు అస్సోం వాసులు. అస్సోంలోని దిగువ అస్సోంలో బొకా సాల్ గా పిలిచే వరి వంగడం ఈ బియ్యం ప్రత్యేకత ఇది. అందుకే ఈ బియ్యానికి భౌగోళిక గుర్తింపు(జీఐ)ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మరీ ముఖ్యంగా అసోంలోని నల్బరీ, బార్పెటా, గోల్పరా, కామ్రూప్, ధుబ్రీ, చిరాంగ్, బస్కా, దరంగ్ తదితర ప్రాంతాల్లో ఈ బొకా ఛాల్ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు.
మొఘలుల కాలంలో ఈ బియ్యాన్ని ఎక్కువగా సైన్యం కోసం పండించేవారు. తర్వాతి కాలంలో రైతులు తినడం మొదలుపెట్టారు. జూన్-డిసెంబరు మధ్య ఈ బియ్యాన్ని అసోం రైతులు పండిస్తారు. దీన్ని వండేందుకు ఎలాంటి గ్యాస్, పొయ్యి అవసరం లేదు. కేవలం గంటపాటు చల్లటి నీటిలో నానబెడితే సరిపోతుంది. నీటిలో నానడం వల్ల బియ్యం ఉబ్బి మెత్తగా మారుతుంది. ఆ తర్వాత ఇందులో పెరుగు, బెల్లం, అరటిపండు ఇలా కావాల్సిన పదార్థాలను కలుపుకుని నేరుగా తినేయ్యొచ్చు. అసోంలోని కొన్ని ప్రాంతాల్లో పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంటికి వచ్చిన అతిథులకు ఈ బియ్యాన్ని వండిపెడతారు.
అయితే ప్రస్తుత కాలంలో ఈ బియ్యాన్ని రైతులు కేవలం తమ కోసం మాత్రమే పండించుకుంటున్నారు. బయట వ్యక్తులకు ఇది అంతగా తెలియకపోవడంతో మార్కెట్ పరంగా లాభదాయకంగా ఉండదని రైతులు భావిస్తున్నారు. ఈ బియ్యం గురించి తెలుసుకున్న రెండు స్వచ్ఛంద సంస్థలు లోటస్ ప్రొగ్రెసివ్ సెంటర్(ఎల్పీసీ), సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్(సీఈఈ) దీనిపై పరిశోధనలు చేశాయి. ఈ బియ్యం గురించి అందరికీ తెలియజేసి మార్కెట్ను పెంచాలనే ఉద్దేశ్యంతో 2016లో ఈ సంస్థలు బొకా ఛాల్కు భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల బొకా ఛాల్కు జీఐ గుర్తింపు ఇచ్చింది.
ఈ బొకా ఛాల్ ఆరోగ్యానికి ఎంతోమంచిదని ఇటీవల గువాహటి యూనివర్శిటీ చేసిన అధ్యయనంలోనూ తేలింది. ఇందులో 10.73శాతం ఫైబర్, 6.8శాతం ప్రొటీన్లు ఉన్నాయని సదరు అధ్యయనం పేర్కొంది. ఈ బియ్యం మనిషి శరీరంలోని వేడిని తగ్గింస్తోందట. అంతేగాక.. ఈ బియ్యాన్ని రసాయనాలతో కూడిన క్రిమిసంహారక మందులతో పండించడం సాధ్యం కాదట. ఒకవేళ అలాంటివి వాడితే పంట మొత్తం నాశనమవుతుందని తమ పరిశీలనలో తేలిందని ఎన్జీవోలు చెబుతున్నాయి. కేవలం బయో ఎరువులు మాత్రమే వినియోగించి రైతులు ఈ బియ్యాన్ని పండిస్తారు. అత్యవసర సమయంలో ఈ బియ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎల్పీసీ, సీఈఈ ఎన్జీవోలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల అసోం రైతులకు లాభదాయకం గానూ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more