విద్యార్థులకు పాఠాలతో పాటు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. వారిని రోడ్డు రిపేరు పనుల నిమిత్తం పంపుతూ.. పార్ట్ టైం టీచర్లుగా, ఫుల్ టైం కాంట్రాక్టర్లుగా మారిపోయారు. అదేంటి అంటే కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే మనుషులకు డబ్బులు చెల్లిస్తూ కూడా వారితో అయ్యా, బాబు అంటూ పనులు చేయించుకుంటారు. కానీ ఇక్కడి ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులచే రోడ్డు రిపేరు పనులను ఉచితంగా చేయించుకుంటూ అందుకు నిరాకరించిన విద్యార్థులను చావబాదుతున్నారు. దీంతో ఎదురుతిరిగే ధైర్యం లేక.. టీచర్లు చెప్పింది చేసేస్తున్నారు విద్యార్థులు.
టీచర్స్ డే రోజున లేక నవంబర్ 15న బాలల దినోత్సవం రోజుకు ముందురోజున స్కూలుకు వెళ్లే పిల్లలు తమ గదులను శుభ్రం చేస్తుంటారు. ఇంకా అవసరమైన పక్షంలో అవసరమైతే పాఠశాల ఆవరణను కూడా శుభ్రం చేసి.. అందంగా అలంకరిస్తారు. తమ పాఠశాలలో పచ్చధనం-పరిశుభ్రతా వుండాలని ఉద్దేశ్యంతో మొక్కలు కూడా నాటుతుంటారు. టీచర్లు, విద్యార్థులు కలసి సరదా వాతావరణంలో ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ హరియాణాలో మాత్రం సీన్ రివర్స్ అయింది.
ఇక్కడి మహేంద్రగఢ్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద రోడ్డు బాగా దెబ్బతింది. దీంతో స్కూల్ కొచ్చిన విద్యార్థులకు టీచర్లు చదువు చెప్పకుండా రోడ్డు రిపేర్ చేయాలని ఆదేశించారు. దీంతో పిల్లలు యూనిఫాంలోనే మట్టి, కంకర తీసుకొచ్చి రోడ్డు గుంతలను పూడ్చుతున్నారు. ఈ విషయమై విద్యార్థుల్ని మీడియా ప్రశ్నించగా.. రోడ్డు రిపేరు చేయకుంటే టీచర్లు తమను చావబాదుతున్నారని పిల్లలు వాపోయారు. దీంతో ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారి రాజ్ బాలా దృష్టికి కొందరు తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ బాలా తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more