సంచలన వ్యాఖ్యలకు, కాంట్రావర్సీ కామెంట్లకు కేంద్ర బిందువైగా నిలిచే విశ్వ హిందూ పరిషత్(వీ హెచ్ పీ) నేత సాధ్వి ప్రాచి.. మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు లవ్ జీహాద్ పేరిట ముస్లిం యువకులు హిందూ యువతులను పెళ్లాడకుండా పలు హిందూ సంస్థలు అడ్డుకోవడం.. తప్పదనుకుంటే పరమతం యువకులపై దాడులకు కూడా పాల్పడుతున్న క్రమంలో.. అమె ముస్లిం యువతులు మాత్రం తాము అనుభవిస్తున్న కష్టాలు దూరం చేసుకోవాలంటే హిందూ యువకులను పెళ్లాడాలని సూచించారు.
ముస్లిం అమ్మాయిలు హిందూ మతం స్వీకరించి హిందూ యువకులను పెళ్లాడాలని సాధ్వీ ప్రాచీ పిలుపునిచ్చారు. హిందూ యువకులను పెళ్లాడటం ద్వారా ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి దురాచారాల నుంచి వారు తేలిగ్గా బయట పడొచ్చన్నారు. మధుర లోని బంకే బిహారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. హిందూ మతాన్ని స్వీకరించడం ద్వారా ముస్లిం యువతులు అనేక వేధింపుల నుంచి బయటపడొచ్చని సూచించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం వుందని.. వారిని దేవతలుగా కొలిచే తత్వం కూడా వుందని అన్నారు.
కాగా, యూపీలోని ఓ దేవాలయంలోకి ఓ మహిళా ఎమ్మెల్యే వెళ్లినందుకు మందిరంలో గంగా జలంతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బిడ్డకు జన్మనిచ్చేందుకు స్త్రీ కావాలి కానీ, దేవాలయంలో పూజలకు మాత్రం ఆమెకు అవకాశం ఉండదా? అని సాధ్వీ ప్రశ్నించారు. మహిళలపై ఇలాంటి వివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డాడు. అయోధ్యలో రామాలయం రాజకీయ అంశం కానేకాదని సాధ్వీ తెలిపారు. ఇది కోట్లాది హిందువుల నమ్మకానికి సంబంధించిన అంశమని ఆమె స్పష్టం చేశారు. రామాలయ నిర్మాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు.
ఇక గోరఖ్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న అమె పనిలో పనిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ నాథ్ ఆశీస్సుల కోసం క్రమం తప్పకుండా వస్తుంటానన్న అమె.. ఈసారి మాత్రం ఒక ప్రత్యేకమైన కోరికను కోరుకోవడానికి వచ్చానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని కాంగ్రెస్ సాధించినా, లేకపోయినా.. కనీసం రాహుల్ గాంధీకి భార్య మాత్రం లభించాలని కోరుకున్నానని చెప్పారు. సాధ్వి ప్రాచి వ్యాఖ్యలపై యూపీ కాంగ్రెస్ నేత అశోక్ సింగ్ స్పందిస్తూ.. కాంగ్రెస్ నేతలను అవహేళన చేసే విధంగా మాట్లాడటం వారికి పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ, తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more