కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ‘డిజి యాత్ర’ సౌకర్యం రాకతో ఇక విమానయాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా తమ ప్రయాణాలను చేసుకునే వీలు కల్పించనుంది. ఈ డిజి యాత్ర సదుపాయం మరో రెండు నెలల్లో అమలులోకి రానుండటంతో.. ఇక కేవలం రెండు మాసాలు ఒపిక పడితే.. ఆ తరువాత ప్రయాణికులు వేగిర ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇవాళ ఈ విషయం వెల్లడించారు.
‘డిజి యాత్ర’ సౌకర్యం వల్ల విమానయానంలో కాగితం వినియోగాన్ని తగ్గించడంతో పాటు అవాంతరాలు లేని వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. డిజిటల్ వ్యవస్థ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి, విమానం ఎక్కడానికి సదరు ప్రయాణికుల ఆధార్ నంబర్ ను, మొబైల్ నంబర్ ను వినియోగిస్తారు. ఈ వ్యవస్థ కింద డిజిటల్ రూపంలోనే టికెట్ బుకింగ్, విమానాశ్రయం ఎంట్రీ, బోర్డింగ్ పాస్, సెక్యూరిటి చెకింగ్ ను నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ భావిస్తోంది.
తమ ప్రభుత్వం రానున్న రోజుల్లో డిజి యాత్ర పేరిట సరికొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకు వస్తున్నాం. రానున్న రెండు నెలల్లోనే దీనిని ప్రారంభిస్తామనే విశ్వాసంతో ఉన్నాం’ అని ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఈ ‘డిజి యాత్ర’ వ్యవస్థ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన తరువాత వారి ఫేసియల్ లేదా ఐరిష్ బయోమెట్రిక్ను తీసుకుంటారు. ఆ తరువాత సదరు ప్రయాణికులు జీవితంలో మరెప్పుడైనా సెక్యూరిటి చెకింగ్ లేకుండానే విమానయానం చేయవచ్చు’ అని మంత్రి వివరించారు. అయితే, ప్రజల గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరిస్తుందని, ‘డిజి యాత్ర’ అమలు సందర్భంగా వాటిని ఉల్లంఘించబోదని మంత్రి వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more