అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఓ హైదరాబాదీ యువకుడు అగ్రరాజ్యంలో అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తమ స్నేహితుడు అదృశ్యమైన ఘటనతో తీవ్ర ఆందోళనకు లోనైన అతని స్నేహితులు అక్కడి పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పాటు ఇటు యువకుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన మిర్జా అహ్మద్ అలీ బేగ్ (26) మాస్టర్స్ చదివేందుకు 2015లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్ లో ఓ మొబైల్ షాపులో పార్ట్ టైమ్ పనిచేసుకుంటూ బేగ్ చదువును కొనసాగిస్తున్నారు.
ఈ నెల 20న తల్లితో ఫోన్ లో మాట్లాడిన బేగ్.. తనకు భయంగా ఉందని చెప్పాడు. అయితే తనను ఎవరైనా బెదిరిస్తున్నారా? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన సోదరుడు షుజాత్ బేగ్ ఫోన్ కు 2-3 సార్లు కాల్ చేయగా, ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. మరోసారి కాల్ చేయగా, ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అప్పట్నుంచి బేగ్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఆందోళన చెందిన షుజాత్ వెంటనే బేగ్ పనిచేస్తున్నమొబైల్ షాపుకు కాల్ చేయగా, అతను ఎవ్వరికీ చెప్పకుండా అర్థంతరంగా షాపు నుంచి బయటకు వెళ్లిపోయాడని యజమాని జవాబిచ్చాడు.
బేగ్ షాపు నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలోనూ రికార్డయ్యాయి. తన సోదరుడ్నిఎవరో బెదిరిస్తున్నారని షుజాత్ ఆరోపించారు. మరోవైపు బేగ్ అదృశ్యం కావడంపై అతని స్నేహితుడొకరు న్యూజెర్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేగ్ గదిని పరిశీలించగా.. పాస్ పోర్ట్ సహా ఎలాంటి డాక్యుమెంట్లు లభ్యం కాలేదు. కాగా, తన కుమారుడి ఆచూకీని కనిబెట్టాలని బేగ్ తండ్రి ఇస్మాయిల్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. బేగ్ జాడ కనిబెట్టేందుకు సాయం చేయాలని ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ అమెరికాలోని భారత దౌత్య కార్యాలయానికి లేఖ రాశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more