దేశవ్యాప్తంగా గోసంరక్షణ సమితి పేరుతో అవుల్ని తరలిస్తున్నారన్న వార్తలపై కొందరు అమాయకులను టార్గెట్ చేసి చంపుతున్న తీరుపై నిరసనలు పెల్లుబిక్కుతున్న నేపథ్యంలో.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాన మంత్రి గతంలో కొరినా.. బీజేపి కన్నా అరెస్సెస్ పెద్దది, పెద్దన్న అన్న భావనలో ప్రధాని మోదీ వినతిని కూడా లక్ష్యపెట్టని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశంలో ఆవుల్ని చంపడం ఆపేస్తే మూకదాడులు వాటంతట అవే ఆగిపోతాయని ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఏ మతం కూడా ఆవుల్ని చంపడాన్ని అనుమతి ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు.
జార్ఖండ్ లోని రాంచీలో హిందూ జాగరణ్ మంచ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా, రాజస్తాన్ లోని ఆళ్వార్ లో అక్బర్ అనే ముస్లిం యువకుడ్ని కొందరు దుండగులు కొట్టిచంపడంపై ఆయన స్పందిస్తూ.. ’గోవుల్ని చంపమని చెప్పే ఒక్క మతాన్ని నాకు చూపించండి. ఏసుక్రీస్తు పశువుల పాకలో పుట్టిన కారణంగా క్రైస్తవులు సైతం ఆవును గోమాతగా కీర్తిస్తారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనాల్లో గోవుల్ని చంపటాన్ని పాపంగా పరిగణించి నిషేధించారు. ఈ పాపం నుంచి ఈ ప్రపంచాన్ని, మానవకోటిని విముక్తం చేయడానికి మనం కంకణబద్ధులం కాలేమా? అని ఆయన ప్రశ్నించారు.
గోహత్యలు ఆగిపోతే మూకదాడులు వాటంతట అవే తగ్గిపోతాయి‘ అని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పై ఇటీవల జార్ఖండ్ లో కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని కుమార్ ఖండించారు. "ఇది చాలా తప్పు, ఖండించతగినది. అయితే, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు" అంటూ చురక అంటించారు. మూక దాడులు, అల్లర్లను నివారించేందుకు ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికీ, వీటిని అరికట్టేందుకు ప్రజల్లో మంచి సంస్కారం, విలువల్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more