హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తల్లిదండ్రులకు శ్రీరామ రక్షగా మారింది. వారు తమ సంతానానికి ఇచ్చే వారసత్వ సంపదను రద్దు చేసుకునే వెసలుబాటును న్యాయస్థానం కల్పించింది. వృద్ద తల్లిదండ్రులకు వారు అడిగిందల్లా ఇవ్వాల్సిన బాధ్యత సంతానంపైనే వుంటుందని, కేవలం అస్తులు తీసుకుని వారి అరోగ్య, పరిరక్షణ బాధ్యతలను పట్టదని వ్యవహరించే సంతానం నుంచి వారిచ్చిన అస్తిని వెనక్కు తీసుకునే వెసలుబాటు సీనియర్ సిటిజెన్స్ చట్టంలో వుందని ముంబై హైకోర్టు తీర్పును వెలువరించింది.
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అస్తులను అందుకుని వారిని యోగక్షేమాలను పట్టించుకోని సంతానాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అనేక వృద్దాశ్రమాలు, సీనియర్ సిటిజన్ల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఏవో ప్రలోభాలకు గురిచేసి తమ పేరునున్న అస్తులను రాయించుకుని.. ఆ తరువాత వారిని పట్టించుకోని సంతానానికి ఇది ఒక హెచ్చరికలా నిలుస్తుంది. వారిని మాటలతో, చేతలతో హింసించే వారికి కోర్టు తీర్పుతో షాక్ తగిలింది.
పిల్లలకు ఇచ్చిన ఆస్తిలో కొంత బాగాన్ని తిరిగి తీసుకుని హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని… జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్ ల నేతృత్వంలోని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ముంబైలోని అంధేరికి చెందిన ఓ వృద్ధుడు తన ఫ్లాట్లో 50 శాతం భాగాన్ని కుమారుడికి గిఫ్ట్ డీడ్ పేరుతో రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్ ను ట్రిబ్యునల్ రద్దుచేయడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా అమ్మానాన్నలు, వయోవృద్ధుల సంక్షేమకోసం తీసుకువచ్చిన.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ నిర్వహణ, సంక్షేమ చట్టం-2007ను ధర్మాసనం ప్రస్తావించింది.
ప్రస్తుతం తాము ఉంటున్న ఫ్లాట్ను గిఫ్ట్ డీడ్ కింద తన పేరుతో బదలాయిస్తే తండ్రితోపాటు, అతడి రెండో భార్య బాగోగుల్ని చూసుకుంటానని కుమారుడు, కోడలు చెప్పారు. కానీ, ఆ తండ్రి 50 శాతం వాటాను మాత్రమే కుమారుడికి బదలాయించాడు. దీంతో సవతి తల్లిని సాకుగా చూపుతూ వారిద్దరి బాగోగుల్ని కుమారుడు, కోడలు నిర్లక్ష్యంచేశారు. ఈ అగ్రిమెంట్ను ట్రిబ్యునల్ రద్దుచేయడంలో మాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more