నిర్భయ రేప్ కేసులోని దోషులకు ఉరిశిక్షే సరైందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దారుణమైన నేరాలకు పాల్పడిన నిందితులకు వీరికి విధించే మరణశిక్షను ఒక సందేశంగా వెళ్లాలని సూచిస్తూ.. కింది కోర్టులో విధించిన శిక్షలను సమర్థిస్తూ మరణశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని భారత సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
గతంలో మరణశిక్ష విధించిన ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వారికి ఉరి శిక్షే సరైందని స్పష్టం చేసింది. దోషులైన నలుగురు నిందితులు ముఖేష్ (29), పవన్ గుప్తా (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31)లకు గత ఏడాది మే 5న కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో దోషులలో అక్షయ్ కుమార్ సింగ్ మినహా మిగిలిన ముగ్గురు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ లు తమపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు వేసిన శిక్షలను తగ్గించాలని రివ్యూ పిటీషన్ల దాఖలు చేశారు.
దీంతో ఈ పిటీషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి దిపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ముగ్గురు దోషులు వేసిన రివ్యూ పిటీషన్లను తిరస్కరించింది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులనే సమర్థిస్తూ.. మరణశిక్షను ఖరారు చేస్తై తుది తీర్పు వెల్లడించింది. దారుణమైన నేరానికి పాల్పడిన దోషులకు ఉరిశిక్షే సరైందని తేల్చింది. క్యురెటివ్ పిటిషన్ వేసేందుకు వారికి అవకాశం కల్పించింది.
2012 డిసెంబరు 16న దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో తోటి విద్యార్థితో కలిసి బస్సులో వెళ్తున్న ఓ పారామెడికల్ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన యావత్ దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే కలిచివేసిన విషయం తెలిసిందే. అఘాయిత్యం చేయడమే కాకుండా ఆ యువతి లైంగిక అవయవాలు ఇనుప రాడ్డు జొప్పించి దోషులు రాక్షసానందం పొందారు. అనంతరం బస్సులోంచి రోడ్డు మీదకు తోసేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సింగపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 29 ప్రాణాలు విడిచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more