ఐదు రోజుల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలకు జులై మాసం వేదిక కానుంది. ఐదు రోజుల వ్యవధిలోనే అద్భుతాలు కనువించు చేయనుండటంతో ప్రపంచలోని అనేక మంది వాటి అవిష్కృతం కోసం అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ నెల 27న (గురు పౌర్ణమి) రోజున సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. సుదీర్ఘం అంటే నిమిషాల్లో కాకుండా ఏకంగా సుమారు రెండు గంటల సమయం ఈ గ్రహణ సమయం సాగనుంది. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సమయం.. అంటే 1.43 గంటల పాటు చంద్రగ్రహణం సాగుతుంది.
సరిగ్గా భారత్ కాలమానం ప్రకారం రాత్రి 11.54 గంటల తర్వాత ఈ అద్భుతం దర్శనమిస్తుంది. అప్పటి నుంచి రమారమి అర్థరాత్రి ఒంటిగంట నలబై నిమిషాల వరకు గ్రహణం కొనసాగనుంది. రాత్రి రెండు గంటల తరువాత గ్రహణం వీడనుంది. దీంతో పవిత్ర గురుపౌర్ణమి రోజైనప్పటికీ.. సాయంత్రం జరగాల్సిన సద్గురు షిరిడీ సాయి.. పల్లకీ సేవ సహా పలు నిత్య కైంకర్యాలతో పాటు ప్రత్యేక పూజలను కూడా ఆలయాలు రద్దు చేస్తున్నాయి. ఆలయాలు మధ్యహ్నం తరువాత మూసివేయనున్నారు. కాగా, ఈ అద్భుతాన్ని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వీక్షించొచ్చు.
ఇక ఈ అద్భుతం జరిగిన తరువాత నాలుగు రోజున అంటే ఈ నెల 31న మరో ఖగోళ అద్భుతం అవిష్కృతం కానుంది. అదేంటంటే.. అంగారక గ్రహం.. భూమికి చేరువగా చేరుకోనుంది. ఆ సమయంలో రెండు గ్రహాల మధ్య దూరం 5.76 కోట్ల కిలోమీటర్ల మేర ఉంటుంది. 2003 తర్వాత అంగారకుడు మనకు ఇంత చేరువగా రావడం ఇదే మొదటిసారి. అయితే 2003లో 5.57 కోట్ల కిలొమీటర్ల చేరువలోకి వచ్చింది. 60వేల సంవత్సరాల్లో అదే అత్యంత కనిష్ఠ దూరం.
ఈ నెల 31న సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం నడుమ అంగారకుడిని వీక్షించొచ్చు. ఎలాంటి టెలిస్కోపు లేకుండా కంటితోనే దీన్ని చూడొచ్చని నిపుణులు తెలిపారు. సూర్యాస్తమయం తర్వాత తూర్పు-ఆగ్నేయ దిశలో ఆ గ్రహం కనపడుతుందన్నారు. ఒక మోస్తరు స్థాయి టెలిస్కోపుతో చూస్తే అంగారక గ్రహంపైనున్న మంచు ఫలకాలనూ చూడొచ్చని చెప్పారు. మళ్లీ 2035లో ఆ గ్రహం భూమికి చేరువగా వస్తుందని వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more