న్యూఢిల్లీని పరిపాలన విషయంలో ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన ప్రభుత్వం ప్రతీ అంశంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ అమోదం పోందాల్సిన అవసరం లేదని.. అయితే సమాచారం మాత్రం చేరవేయాల్సిందేనని.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే ప్రజాస్వామ్యంలో పెద్దపీటని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలురించినా.. ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఇంకా తానే గోప్ప అన్నట్లు గా వ్యవహరస్తున్నారని, ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా లక్ష్యపెట్టడం లేదని, కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని అప్ నేతలు అరోపిస్తున్నారు.
ఢిల్లీని పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమేనని, లెఫ్టినెంట్ గవర్నర్ వారధిగా ఉండాలే తప్ప ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ పాలనను అస్తవ్యస్థం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత ఆప్ ప్రభుత్వం ఇచ్చిన తొలి ఆర్డర్ తిరస్కరణకు గురైంది. కోర్టు తీర్పు వెలువడిన గంటల తరువాత, అధికారులను బదిలీ చేసే అధికారాన్ని స్వయంగా చూసుకుంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఇంత ముఖ్యమైన బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇన్ చార్జ్ గా ఉంటారని చెబుతూ, ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్టు ఎల్జీ కార్యాలయం ప్రకటించింది.
లెప్టినెంట్ గవర్నర్ తాజా నిర్ణయంపై మండిపడ్డ ఆప్ నేతలు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం బీజేపీ పక్కన బెడుతోందని విమర్శించారు. "నిన్నటి తన తీర్పులో కోర్టు స్పష్టంగా చెప్పింది. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో ఎల్జీకి అధికారం లేదు. కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు" అని ఆప్ నేత ఒకరు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎల్జీ బదిలీ ఆదేశాలు, పోస్టింగులపై సంతకాలు చేసే వీల్లేక పోయినప్పటికీ పట్టించుకోవడం లేదని, సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కే బదిలీల అధికారం ఉందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more