తొలిసారిగా ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలోకి దిగుతున్న జనసేన పార్టీ.. రానున్న ఎన్నికలలో వామపక్షాలతో కలసి పోరాడేందుకు సిద్దమని ఇప్పటికే తెలిపారు. జనసేనతో కలసి సీపీఎం, సీపీఐ పార్టీలు ఎన్నికలకు వెళ్లున్నాయని, ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాన్ తో కలసి చర్చించి నిర్ణయం తీసుకున్నామని సీపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ కూటమి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని కూడా వామపక్షాలు ప్రకటించాయి.
రానున్న ఎన్నికల నేపథ్యంలో మహా కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణే అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వామపక్ష భావాలతో.. పాలన విధానాల్లో మార్పు రావాలని తీవ్రంగా శ్రమిస్తున్న వ్యక్తి పవన్ కల్యాన్ అని.. ప్రజలకు నిజమైన మేలు జరగాలంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాలపై పవన్ కు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. పవన్ కు ఇమేజ్, క్రేజ్ తో పాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తపన కూడా వుందని అన్నారు.
కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 85 శాతం నిధులు ఇచ్చిందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో ఏ పార్టీ అయినా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని పొత్తులు పెట్టుకుంటే... వారికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తనకు రెండేళ్ల సమయం ఇస్తే... కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానంటూ గాలి జనార్దనరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని... వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో ఈ నెల 4న విజయవాడలో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more