దేశ అర్థిక రాజధాని ముంబై నగరం వణికిపోయింది. జూహు విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో ఘట్కోవర్ ప్రాంతంలో చార్డెడ్ విమానం ఒక్కసారిగా జనవాసాల మధ్య కుప్పకూలింది. భారీ విస్పోటనంతో అకస్మాత్తుగా మంటలు కూడా చెలరేగి వ్యాపించిన క్రమంలో.. ముంబై నగరవాసులు భయకంపితులయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాడింగ్ అయ్యే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదఘటనలో ఒక పైలట్ సహా ముగ్గురు విమాన సిబ్బందితో పాటుగా మరో పాదచారి మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యుఐ సంస్థకు చెందినదని అధికారులు వెల్లడించారు. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నుంచి యూఐ సంస్థ VT-UPZ ఎయిర్ క్రాఫ్ట్ ను కొనుగోలు చేసింది. అయితే సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ విమానానికి నాలుగు రోజుల క్రితమే రిపేర్లు చేశారు. కాగా ఇవాళ టెస్టు డ్రైవ్ చేపట్టిన విమాన సంస్థ.. ఈ సందర్భంగా పైలట్ తో పాటు సాంకేతిక లోపాలను సరిచేసేందుకు ఇద్దరు ఏరోనాటికల్ ఇంజనీర్లతో పాటు మరో టెక్నికల్ సిబ్బంది కూడా విమానంలో ప్రయాణించారు.
కాగా, అంత సవ్యంగా సాగి.. చివరకు ల్యాండింగ్ అయ్యే క్రమంలో జనవాసాల మధ్య కుప్పకూలింది. ఎయిర్ క్రాఫ్ట్ లో ఎంత మంది ఉన్నారు.. వారు ఎవరు అనే విషయాలను యూపీ ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, మున్సిపాలిటీతోపాటు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి వుంది.
#WATCH: A chartered plane crashes near Jagruti building in Ghatkopar where a construction work was going on. #Mumbai pic.twitter.com/ACyGYymydX
— ANI (@ANI) June 28, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more