ఓ వైపు ఏటీఎం కేంద్రాలలో డబ్బులేక నగదు కొరతతో మొర్రో అని వాపోతున్న వేళ, ఏటీయం సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటైన ఏటీయం కేంద్రాలలో డబ్బు లేక బోసిపోయిన ఏటీయం యంత్రాలు దర్శనమిస్తుంటే.. ఇక్కడ మాత్రం బోలెడన్నీ నోట్లు వున్నా.. అవి ఎందుకూ పనికిరాని చిత్తుకాయితాలుగా మారిపోయి.. అధికారుల, ఏటీయం సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఏటీయం కేంద్రంలోని నోట్లపై ఓ మూషికం సర్జికల్ స్ట్రైక్ చేసి.. కరెన్సీ నోట్లను కాస్తా చిత్తుకాయితాలుగా చేసింది. ఇంతకీ వాటి విలువెంతో తెలుసా.? అక్షరాల 12 లక్షల పైమాటే.
ఈ విచిత్ర ఘటన అసోంలోని గౌహతి సమీపంలోని టిన్సుకియా లైపులి అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల.. ఎలా చేరిందో కానీ ఓ మూషికరాజు టిన్సుకియా ప్రాంతంలోని ఎస్బీఐ ఏటియం వద్దకు చేరింది. ఇక అలికిడి కావడంతో.. నేరుగా ఏటీయంలోకి దూరిపోయింది. పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడిలా ఎలుక పరిస్థితి తయారైంది. ఎలా వెళ్లిందన్న విషయాన్ని పక్కనబెడితే.. బయటకు వచ్చేందుకు మాత్రం మార్గం కనబడక.. నానా హైరానా పడిన ఎలుక.. కస్టమర్లు డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లి కార్డు స్పైప్ చేసిన సందర్భంలో ( తనకు తెలియకుండానే యంత్రంలో కదలికలు రావడంతో) కంగారు పడిన మూషికం.. ఇక తన పని తాను కానిచ్చింది.
ఏటీఎం కేంద్రంలోని యంత్రంలో వున్న కరెన్సీ నోట్లపై సర్జికల్ స్ట్రైక్ కానిచ్చింది. ఏకంగా రూ. 12.38 లక్షల నోట్లను తినేసింది. గత నెల19వ తేదీన ఈ ఏటీఎంలో రూ. 29.48 లక్షల విలువైన రూ. 2 వేలు, రూ. 500 నోట్లను అధికారులు నింపారని, ఆపై ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పత్రిక ఒకటి కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 11వ తేదీన అధికారులు ఏటీఎంను ఓపెన్ చేయగా, మిగిలిన కరెన్సీ చిత్తు కాగితాల్లా కనిపించాయని, ఓ ఎలుక ఈ పని చేసిందని తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారని పేర్కొంది. జరిగిన ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును దర్యాఫ్తు చేస్తున్నారని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఏటీఎంలో చిత్తు కాగితాల్లా పడివున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more