యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఖరి పట్ల యోగా గురు బాబా రాందేవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే రాజకీయ ఒత్తిడిలు పనిచేశాయా.? అంటే అవుననే సమాధానమే వస్తుంది. రాష్ట్రంలోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై నిర్మించ తలపెట్టిన మెగా ఫుడ్ పార్క్ ను కూడా తాము రద్దు చేసుకుని వేరే రాష్ట్రానికి తరలించాలని కీలక నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో అఘమేఘాట మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్.. బాబా రాందేవ్ తో ఫోన్ ద్వారా సంభాషించి సమస్యను పూర్తిగా తెలుసుకున్నారు. అంతేకాదు ఫుడ్ పార్క్ తరలిపోకుండా చర్యలు తీసుకున్న సీఎం.. ఆ యూనిట్ కు అవసరమైన అన్ని అంశాలను తానే స్వయంగా చూస్తానని కూడా హామీ ఇచ్చారు.
పతాంజలి ఫుడ్ పార్క్ తరలిపోవడం లేదని.. ఈ విషయంలో సీఎం యోగీ.. బాబా రాందేవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడారని రాష్ట్ర మంత్రి సతీష్ మహనా దృవీకరించారు. గ్రేటర్ నోయిడా పరిధిలోని సుమారు 455 ఎకరాల్లో నిర్మించాలని భావించిన భారీ ప్రాజెక్టును మరో రాష్ట్రానికి తరలించనున్నట్టు 'పతంజలి ఆయుర్వేద' ఎండీ ఆచార్య బాలకృష్ణ ప్రకటించిన తరువాత ముఖ్యమంత్రి రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలను తీసుకున్నారని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాబా రాందేవ్ కు చెందిన పతాంజలి అయుర్వేద సంస్థకు.. అయుర్వేద ఉత్పత్తుల తయారీ కోసం ఈ భూమిని కేటాయించింది. కాగా, బాబా రాందేవ్ ఆ భూమిలో పతాంజలి అయుర్వేద సంస్థకు బదులు పతాంజలి ఫుడ్ పార్క్ సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి జేపీ మీనా దీనిని వ్యతిరేకించారు.
ఈ విధంగా పతాంజలి సంస్థ తమ ఇస్టానుసారంగా మార్పులు చేసుకునేందుకు వీలు లేదని, ఒక వేళ అలా చేయాలంటే.. మరోమారు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వుంటుందని అక్షేపించారు. దీంతో గత కొన్ని నెలలుగా తాము చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని.. అందుకే తాము సంస్థను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని బావిస్తున్నామని పతాంజలి సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో మంత్రి సతీష్ మహానా మాట్లాడుతూ.. ఇందుకు ప్రభుత్వంతో మరోమారు ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఈ విషయాన్ని క్యాబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. దీంతో పతాంజలి ఫుడ్ పార్క్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more