దేశానికి రాజైనా అమ్మకు కొడుకే అని.. సెలబ్రిటీలుగా ఎంత ఎత్తు ఎదిగినా.. తన సొంతూళ్లో మాత్రం ఏరా అనే స్నేహితులే వుంటారన్నది వాస్తవం. అయితే స్నేహితులే కాదు ఇరుగుపోరుగు వారితో ఎదురయ్యే ఇబ్బందులు కూడా అలాగే వుంటాయని తాజాగా నటి అపూర్వ విషయంలో రుజవైంది. అమెకు చెందిన భూమిని నలుగురు రైతులు కబ్జా చేశారని ఏకంగా అమె పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు ఇవ్వడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. తన పోలం పక్కనే భూములున్న రైతులు అమె పొలాన్ని కబ్జా చేశారని అమె పోలీసులను అశ్రయిందారు.
వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో క్యారెక్టర్ అర్టిస్టుగా గుర్తింపు పోందిన నటి అపూర్వకు తల్లి నుంచి నాలుగు ఏకరాల భూమి వారసత్వంగా లభించింది. అయితే అమె తన నటనారంగలో స్థిరపడటంతో హైదరాబాదులోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలో అమెకు చెందిన భూమిని గత కొన్నేళ్లుగా అమె పక్కనున్న రైతులు అక్రమించుకుని పంటలు పండిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అమె తన పొలం సరిహద్దులను నిర్ణయించాలంటూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేశారు.
సర్వేయర్ వచ్చి సర్వే చేసి అమె నాలుగు ఎకరాల పోలం తాలుకు సరిహద్దులను చూపడంతో.. అమె వాటి చుట్టూ రాళ్లు పాతించి.. హద్దులను కనబడేలా చేశారు. ఈ నాలుగు ఏకరాల చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని భావించారు. అయితే సర్వే చేసిన మరుసటి రోజున పోలానికి వెళ్లి చూడగా అమె పాతించిన రాళ్లన్ని తొలగించివేయబడ్డాయి. దీంతో అమె స్థానిక పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో పక్కనున్న నలుగురు పోలాల రైతుల పేర్లపై అమె పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా పోలీసులు మాత్రం ఇది సివిల్ వ్యవహారమని.. దీంతో ఎమ్మార్వో సాయంతో సరిహద్దులు నిర్ణయించి సమస్య పరిష్కారానికి చోరవ చూపుతామని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more