రాష్ట్రంలోని ఏ మూలకు వెళ్లినా అగ్రిగోల్డ్ బాధితులు వున్నారని, మధ్య, పేద తరగతికి చెందిన ప్రజలు తమ బిడ్డల భవిష్యత్తు కోసమని తినితినక.. చొమటోడ్చిన డబ్బును అగ్రిగోల్డ్ లాంటి సంస్థల ప్రచారాలను నమ్మి అందులో పెట్టుబడులు పెడితే.. వారిని లూటీ చేసిన అగ్రీగోల్డ్ సంస్థకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా.? ఇందుకేనా ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసింది. ప్రజలకు ఆగ్రీగోల్డ్ అస్తులు దక్కేలా చేయాల్సిన ప్రభుత్వం.. నాలుగేళ్లుగా ఎందుకు తాత్సరం చేస్తుందని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
అగ్రీగొల్డ్ బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తుందని అన్నారు. అలాగే ఆ సంస్థ ఆస్తులను చౌకగా కొట్టేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, జనసేన ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటామని హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో పోరాట యాత్ర కొనసాగిస్తున్న పవన్ మాట్లాడుతూ... ఆశా వర్కర్ల, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీర్చాలని, వారి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సరైన జీతభత్యాలు అందించాలని డిమాండ్ చేశారు.
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తమ పార్టీ మేనిఫెస్టోలోనూ పొందుపరుచుతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా నిలబడే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఉండాలి కానీ, వారిని దోచుకునే ప్రభుత్వం ఉండకూడదని హితవు పలికారు. జనసేన పార్టీ కనుక ఆవిర్భవించకుంటే ఈ రెండు పార్టీలు కలిసి ఊళ్లను పంచుకుని ఉండేవని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ విషయాన్ని తలచుకుంటేనే భయమేస్తోందన్నారు. అవినీతి జరిగినట్టు నిరూపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాలు చేస్తున్నారని, లంచాలు తీసుకునే వారు రసీదులు ఇస్తారా? అని ప్రశ్నించారు.
స్థానిక టీడీపీ నేతలనూ పవన్ వదలిపెట్టలేదు. గిరిజనుడు కాని భాంజ్దేవ్ను టీడీపీ సాలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారని పేర్కొన్న ఆయన, సాగునీటిని ఆయన చేపల చెరువులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువులకు మాత్రం నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ పోస్టులను సైతం టీడీపీ నాయకులు లక్షలాది రూపాయలకు అమ్ముకుంటున్నారని అన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు అధికారులపై జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. 2019లో జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more