తమిళనాడులోని తూత్తుకుడి బాధిత కుటుంబాలను తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఇవాళ పరామర్శించారు. తూత్తుకూడిలోని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో.. నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపినఘటనలో 13 మంది మృత్యువాత పడిగా వారి కుటుంబాలను రజనీకాంత్ ఓదార్చారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన వారికి అర్థిక సాయంగా తన వంతుగా ప్రతీ కుటుంబానికి రెండు లక్షల రూపాయల సాయం అందిస్తానని ప్రకటించారు.
స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ యజమానులు కూడా అమానవీయంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ప్రసుత్తం వున్న పర్యావరణ అనుమతులతోనే వారు విస్తరణకు వెళ్లడంతో పాటు.. స్థానికుల విన్నపాలను పట్టించుకోకుండా నిర్ధయగా వ్యవహరించడంతోనే ఇంతటి ఘోరం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఈ పరిశ్రమ ఎప్పటికీ తెరచుకోవడానికి వీల్లేదని రజనీకాంత్ అన్నారు. ఈ ఆందోళనల్లో ప్రవేశించి విధ్వంసానికి కారణమైన అసాంఘిక శక్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని రజనీకాంత్ డిమాండ్ చేశారు.
ఈ ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం లాంటిదని, ఇంతటి అల్లర్లు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేకపోయారని అన్నారు. తూత్తుకుడిలో జరిగిన విషయాలన్నీ ప్రజలకు తెలుసని, వారికి సమయం వచ్చినప్పుడు తగిన సమాధానం ఇస్తారని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను కొందరు రాజకీయం చేస్తున్నారని, అన్ని సమస్యలకు రాజీనామాలు చేయాలని మంత్రుల ముందు డిమాండ్ ఉంచడం పరిష్కారం కాదని రజనీకాంత్ అన్నారు. తూత్తుకుడి ఘటనలో నిఘా వర్గాల వైఫల్యం ఉందని, అలాగే ఈ ఘటనపై ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్పై తనకు నమ్మకం లేదని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more