కర్ణాటక ప్రజలు తమ పార్టీకే నైతికంగా అధికారాన్ని అప్పగించారని.. ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం అనైతిక పోత్తుతో ఏర్పడిందని సాక్షత్తు బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గత ఎన్నికలలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవిర్భవించిన లెక్కలను చూపుతూ చెసిన వ్యాఖ్యలివి. అయితే ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వానికి కనీసం ఊపిరి తీసుకునే వెసలుబాటు కూడా ఇవ్వకుండానే అనైతిక పోత్తులోని ప్రభుత్వం రైతుల రుణాలను తక్షణం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపి రాష్ట్రశాఖ అప్పుడే బంద్ కు కూడా పిలుపునిచ్చింది.
రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి కుమారస్వామి మాట తప్పారని ఆరోపిస్తూ బంద్కు పిలుపునిచ్చిన కర్ణాటక బీజేపీ నేతలు ఇప్పుడు తీరిగ్గా చింతిస్తున్నారు. వారిచ్చిన బంద్ పిలుపునకు ప్రజల నుంచి ముఖ్యంగా రైతుల నుంచి లేశమాత్రమైనా స్పందన లేకపోవడం బీజేపీ నేతలకు తలకొట్టేసినట్టు అయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలను మాఫీ చేస్తానని కుమారస్వామి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రోజులు గడుస్తున్నా రుణమాఫీ చేయడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. రూ.53 వేల కోట్ల విలువైన రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు.
స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలంటూ రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదు. స్కూళ్లు, కాలేజీలు, రవాణా వ్యవస్థలకు ఎక్కడా ఆటంకం కలగలేదు. బంద్ పిలుపులో రాజకీయ కోణం ఉందన్న కారణంతో చాలామంది రైతులు, కన్నడ సంస్థలు బంద్కు దూరంగా ఉన్నాయి. తామిచ్చిన బంద్ పిలుపు అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రతిపక్ష బీజేపీ నిరాశలో కూరుకుపోయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more