కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ఓటరు తీర్పుతో దిమ్మదిరిగిన పార్టీలు ఎట్టకేలకు సయోద్య కుదుర్చుకుని స్పీకర్ ఎన్నిక విషయంలో చివరి వరకు ఉత్కంఠ రేపినా.. చివరిలో మాత్రం ఏకగ్రీవం చేసుకున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఏఆర్ రమేష్ కుమార్ ను ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నుకున్నాయి. చివరాఖరు నిమిషంలో పోటీ నుంచి బీజేపి తమ అభ్యర్థి సురేష్ ను తప్పించడంతో రసకందాయంలో పడతాయని భావించిన స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఇక కుమారస్వామి ప్రభుత్వం శాసనసభలో బలనిరూపణ కూడా నిరూపించుకోనుంది.
అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్, తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తదితరులు రమేష్ కుమార్ స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంలో సహకరించిన ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్ష నేత యడ్యూరప్ప స్పీకర్ ఎన్నిక పట్లు ధన్యావాదాల తీర్మాణంపై మాట్లాడుతూ.. తమ్ముడు కుమారస్వామి తనను ప్రశంసించిన సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
అదే సమయంలో గతంలో స్పీకర్ గా పనిచేసిన అనుభవమున్న నాయకుడు మరోమారు సభాధ్యక్ష పదవికి ఎన్నికకావడం సంతోషకరమని అన్నారు. తాజా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కొత్తగా స్పీకర్ గా ఎన్నికైన అనుభవజ్ఞుడైన రమేష్ కుమార్ ఐదేళ్ల పాటు సభను సజావుగా నడిపించాలని అన్నారు. అయనకు అపారమైన అనుభవంతో పాటు చట్టాలపై కూడా మంచి అవగాహన వుండటంతో ఆయనతో ఆ పదవికి మరోమారు కీర్తిరావాలని అకాంక్షించారు.
స్పీకర్ ఎన్నికకు సహకరించిన బీజేపికి ఉపముఖ్యమంత్రి పరమేశ్వరన్ ధన్యావాదలు తెలిపారు. కాగా, రమేష్ కుమార్ గతంలో ఎస్ఎం కృష్ణ హయాంలో స్పీకర్ గా ఐదేళ్ల పాటు సభను సజావుగా నడిపించారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో అరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. శ్రీనివాసపురం నుంచి అరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆయన 18 ఏళ్ల తరువాత మరోమారు కర్ణాటక స్పీకర్ గా బాధ్యతలను చేపట్టారు. ఇక స్పీకర్ ఎన్నిక పట్ల ధన్యావాదాలను సభ్యులు తెలిపిన అనంతరం కుమారస్వామి ప్రభుత్వం తమ బలాన్ని కూడా నిరూపించుకోనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more