రాజకీయ పార్టీలు జోక్యం, సంఘ వ్యతిరేక శక్తులు రంగప్రవేశం చేసి తూత్తుకుడిలో ఆందోళనకారులను తప్పుదోవ పట్టించాయని.. శాంతియుతంగా జరుగుతున్న అందోళనను హింసాత్మకంగా మార్చారని.. ఈ నేపథ్యంలో ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని తమిళనాడు సీఎం పళనిస్వామి ఘటనపై వివరణ ఇచ్చారు. ఈ పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతి చెందారని ఆయన ప్రకటించారు. తమపై దాడి చేయడానికి దూసుకొస్తోన్న వారి నుంచి తమను తాము కాపాడుకోవాలని ఎవరైనా అనుకుంటారని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డీఎంకే సహా విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు చెన్నైలోని అసెంబ్లీ వద్ద మెరుపు ధర్నాకు దిగారు. తూత్తుకుడి స్టెరిలైట్ ప్రాజెక్టును మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో డీఎంకే శ్రేణులు అసెంబ్లీ వద్దకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో, స్టాలిన్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులకు-డీఎంకే శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, అమాయకుల ప్రాణాలను తీసిన వారిపై ఇంతవరకు ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక అసమర్థ ముఖ్యమంత్రి పాలన కొనసాగుతోందని విమర్శించారు. కనీసం ఘటనా స్థలానికి వెళ్లి, బాధితులతో మాట్లాడాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని, డీజీపీ కూడా బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తమిళనాడు బంద్ కు డీఎంకే పిలుపునిచ్చింది.
ఇక స్టెరిలైట్ కాపర్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతొంది. తూత్తుకుడి జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు.. ఆయా ప్రాంతాల్లో ఇంటికీ వెళ్లి యువకులను అదుపులోకి తీసుకుంటున్నారు. యువతే కాల్పుల ఘటనకు కారణమయ్యారని ప్రభుత్వం భావిస్తుంది. వీరిని అదుపుచేస్తే అంతా సద్దుమణుగుతుందన్న భావనతో ప్రభుత్వం వుండగా, ఈ పరిసరాల్లో ఇదే మరోమారు ఉద్రిక్తతకు దారితీయవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితి నిగురుగప్పిన నిప్పులా వుందని కూడా పేర్కోంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more