తన ఒక్కగానోక్క కుమారుడు వైష్ణవ్ మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినా.. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయకు మాత్రం ఆ విషాద వార్తను బుధవారం ఉదయం ఐదు గంటలకు తెలిసింది. అర్థరాత్రి సమయంలో తన కొడుకు మరణించిన వార్తను వైద్యులు అయనకు తెలియజేయలేదు. అర్థరాత్రి సమయంలో కొడుకు పరమపదించాడన్న చేధువార్తను చెప్పే ధైర్యం వైద్యులు చేయలేదు. దీనికి తోడు ఇలాంటి కటువైన వార్తను అర్థరాత్రి నిద్రపోతున్న వ్యక్తులను లేపి చెప్పితే వారి అరోగ్య పరిస్థితులపై కూడా ప్రభావం పడుతుందని వైద్యులు ఇలా చేశారని సమాచారం.
హైదరాబాద్ రాంనగర్ లోని నివాసంలో మంగళవారం రాత్రి పదిన్నర గంటలకు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తుండగా బండారు వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బండారు దత్తాత్రేయ. డాక్టర్ ఆవుల రామచంద్రరావు తదితరులు సమీపంలోనే ఉన్న గురునానక్ కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ‘సార్.. ఏం కాదు.. మేము చూసుకుంటాం కదా మీరు ఇంటికెళ్లండి’ అని రామచంద్రారావు తదితరులు చెప్పడంతో ఎంపీ దత్తాత్రేయ ఇంటికెళ్లి నిద్రపోయారు. తరువాత పన్నెండున్నర గంటల సమయంలో వైష్ణవ్ మరణించాడని డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు.
మీడియా ప్రతినిధుల ద్వారా విషయం తెలుసుకున్న హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ రాత్రి ఒంటి గంటకు వచ్చి పరామర్శించి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్, శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డి తెల్లవారు మూడు గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. వైష్ణవ్ మరణించిన విషయం తెలుకుని.. ఆ విషాద వార్తను దత్తాత్రేయకు ఉదయం 5 గంటలకు ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలుకున్న దత్తాత్రేయ హుటాహుటిన తన సతీమణితో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. జీవం లేని కుమారుడిని చూసి బోరున విలపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more