అగ్రీగోల్డ్ మోసం బయటకు వచ్చినప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్, బోర్డు సభ్యుడు అవ్వాస్ సీతారాం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. గత కొంతకాలంగా సీతారాంను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపిన అధికారులు, ఆయన ఢిల్లీలో తలదాచుకున్నారని తెలుసుకుని ట్రాప్ చేశారు. సీతారాంను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ నుంచి వెళ్లిన సీఐడీ అధికారులు, ఢిల్లీలో సీతారాంను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆది నుంచి సీతారాం ప్రమేయంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.
అగ్రిగోల్డ్ కేసులో అవ్వాస్ సీతారామారావు అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకొంది. దీంతో ఇకపైనైనా ఈ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందన్న అశాభావం అగ్రీగోల్డ్ బాధితుల నుంచి వ్యక్తమవుతుంది. ముందస్తు బెయిల్ ను న్యాయస్థానం నిరాకరించిన నాటి నుంచి అజ్ఞాతం బాట పట్టి తప్పించుకుని తిరుగుతున్న సీతారామారావును అరెస్టు చేసిన పోలీసులు ఢిల్లీ నుంచి విజయవాడకు త్వరలో తరలించనున్నారని సమాచారం.
అగ్రిగోల్డ్ కు చెందిన ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ సమయంలో ఎస్సెల్ కంపెనీ ఈ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే ఎస్సెల్ కంపెనీ ఈ ఆస్తులు కొనుగోలు చేయకుండా సీతారామారామారావు అడ్డుకొన్నారని సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు కూడ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఛైర్మెన్ వెంకటరామారావును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సోదరుడు సీతారామారావును అరెస్ట్ చేయకపోవడంపై బాధితులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సీతారామారావు అరెస్ట్ తో ఈ కేసు మరింత కొలిక్కి వచ్చే అవకాశం లేకపోలేదని బాధితులు అభిప్రాయపడుతున్నారు.
2011 వరకు అగ్రిగోల్డ్ బోర్డు మెంబర్ గా సీతారామారావు కొనసాగారు. అయితే అదే సంవత్సరంలో ఆయన బోర్డు మెంబర్ పదవి నుండి తప్పుకొన్నారు. న్యూఢిల్లీలో ఉన్న సీతారామారావును ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడకు తీసుకొస్తున్నారు. సీతారామారావునును విచారిస్తే ఈ కేసు విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని బాధితులు అభిప్రాయపడుతున్నారు.మరో వైపు అగ్రి గోల్డ్ ఆస్తులను విక్రయించి బాధితులకు పరిహారం చెల్లించే ప్రయత్నాలు సాగుతున్నాయి..అగ్రిగోల్డ్ సంస్థకు ఎక్కడెక్కడ ఏఏ ఆస్తులున్నాయనే విషయమై సీతారామారావుకు తెలిసి ఉంటుందని బాధితులు అనుమానిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more